Friday, April 19, 2024
- Advertisement -

హుజూర్ నగర్ పర్యటనలో వైఎస్ షర్మిలకు షాక్..!

- Advertisement -

వైఎస్‌ షర్మిల నల్లగొండ జిల్లాలో బుధవారం పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. మిర్యాలగూడలో వైఎస్ షర్మిల పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఆమె పలు కుటుంబాలను పరామర్శించడంతో పాటు జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను తెలుసుకున్నారు. ఈ క్రమంలో ఉపాధి లేక ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగుల కుటుంబాలను ఆమె పరామర్శించారు. ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు రాక, ఉపాధి దొరక్క ఇబ్బందులు పడి మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న నీలకంఠ సాయి, అతడి కుటుంబాన్ని పరామర్శించడాకి వెళ్లారు.

మధ్యాహ్నం 12:45 గంటలకు హుజూర్‌నగర్‌ సర్కిల్‌లో మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.అయితే షర్మిల హుజూర్ నగర్ పర్యటనలో ట్విస్ట్ చోటు చేసుకుంది. మేడారం గ్రామంలో ఇంటికి తాళం వేసి నీలకంఠ సాయి కుటుంబం బయటకు వెళ్లిపోయింది.

అయితే షర్మిల వస్తున్నారని.. కావాలనే నీలకంఠ కుటుంబాన్ని టీఆర్ఎస్ నేతలు తరలించారని వైఎస్సార్‌టీపీ నేత పిట్టా రాం రెడ్డి ఆరోపించారు. అధికారం అడ్డు పెట్టుకొని ఎన్ని కుట్రలు పన్నినా.. ప్రజలు అర్ధం చేసుకొని ఎప్పటికైనా బుద్ది చెబుతారని ఆయన అన్నారు. ఇక షర్మిల తాళం వేసిన నీలకంఠ ఇంటి ముందే నిరుద్యోగులతో ముఖాముఖి నిర్వహించారు.

విశాఖలో భారీ ఎన్ కౌంటర్.. ఆరుగురు మావోయిస్టుల మృతి

లోకేష్ బాబు ముద్ద పప్పు.. అందరూ ఆయనలా కావాలా? : ఎమ్మెల్యే రోజా ఫైర్

తెలంగాణలో థియేటర్లు ఓపెన్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -