తమిళ్ హీరో విశాల్కు తెలుగులో మంచి మార్కెట్ ఉన్న సంగతి అందరికి తెలిసిందే. దీంతో విశాల్ సినిమాలు తమిళ్తో పాటు తెలుగులో కూడా విడుదల అవుతుంటాయి.తాజాగా ఆయన నటించిన అభిమాన్యుడు సినిమా తెలుగు విడుదలకు సిద్ధం అయింది. సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఆయన హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో పొల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అంశం మీద స్పందించారు.
ఎవరైనా ఏదైనా హామీ ఇస్తే దాన్ని నిలబెట్టుకోవాల్సిందే అన్నాడు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంలోని మోడీ సర్కారు మాట నిలబెట్టుకోవాలన్నాడు. ఒక తమిళ హీరో అయి ఉండి తెలుగు రాష్ట్ర సమస్య గురించి మాట్లాడిన విశాల్ను అందరు అభినందిస్తున్నారు. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అంశం మీద ఒక్క తెలుగు హీరో స్పందించకపోవడంపై అందరు విమర్శిస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఏ ఒక్కరు దీనిపై కనీసం ట్వీట్ కూడా చేయలేదు.
మన హీరోలకి వాళ్ల సినిమాలు, వాటి కలెక్షన్లు మాత్రమే పట్టించుకుంటారు కాని, రాష్ట్రం ఏమైనా పర్వాలేదనే ధోరణిలో వారు ఉన్నారని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.విశాల్ సమస్యలపై పోరాటం చేయడం ఇదే మొదటిసారి కాదు. తమిళనాడు రైతులు గురించి ధర్నాలు కూడా చేశాడు విశాల్ను చూసి అయిన తెలుగు హీరోలు బుద్ధి తెచ్చెకోవాలని అంటున్నారు తెలుగు ప్రజలు.