Thursday, May 16, 2024
- Advertisement -

మ‌హేష్ కాక‌పొతే మ‌రోక‌రు..సినిమా ఆప‌ను

- Advertisement -

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబుకి రెండు హిట్లు ఇచ్చిన ఘ‌న‌త మొద‌ట ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాథ్‌కే ద‌క్క‌తుంది.పోక‌రి,బిజినేస్‌మ్యాన్ లాంటి రెండు హిట్స్ మ‌హేష్‌కి ఇచ్చాడు పూరి. అలాంటి ద‌ర్శ‌కుడు మ‌రో క‌థ‌ని తీసుకువెళ్లితే మ‌హేష్ నుంచి రెస్ప‌న్స్ రాలేదంటున్నాడు పూరి.గ‌తంతో మ‌హేష్‌తో జ‌న‌గ‌ణ‌మ‌న అనే సినిమా మ‌హేష్‌తో ప్లాన్ పూరి. వెంట‌నే స్టోరీని మ‌హేష్‌కి వినిపించాడు.మ‌హేష్‌కు కూడా స్టోరీ బాగా న‌చ్చ‌డంతో సినిమా తెర‌కెక్కుతుంద‌ని అంద‌రు భావించారు.

ఏమైందో ఏమో తెలియ‌దు కాని మ‌హేష్ ఈ సినిమానే ప‌క్క‌న పెట్టేశాడు.ఈ మ‌ధ్య‌లో మ‌హేష్‌కు ఫ్లాప్‌లు వ‌చ్చాయి.ద‌ర్శ‌కుడిగా పూరికి కూడా బ్యాడ్‌టైం న‌డిచింది.ఇప్ప‌డు ద‌ర్శ‌కుడిగా త‌న స‌త్తా ఏమిటో నిరుపించుకొవ‌ల్సిన టైం వ‌చ్చింది.దీంతో త‌న కొడుకునే హీరోగా పెట్టి త‌న సొంత నిర్మాణ సంస్థ‌లో సినిమా తెర‌కెక్కించాడు పూరి. ‘మెహబూబాస సినిమాపై పూర్తి న‌మ్మ‌కంతో ఉన్నాడు పూరి.ఈ సినిమా ప్ర‌మోష‌న్‌లో భాగంగా మాట్లాడుతు గతంలో తాను మహేష్ బాబు హీరోగా తలపెట్టిన ‘జనగణమన’ చిత్రాన్ని ప్రస్తావించారు.

మహేష్ తో ‘బిజినెస్ మేన్’ తీసిన తరువాత ‘జనగణమన’ ప్లాన్ చేశానని, అయితే, మహేష్ ఏమీ తేల్చలేదని పూరీ చెప్పారు. ఈ సినిమాను మహేష్ చేయకపోయినా ఆపబోనని, మరో హీరోతో ఈ సినిమాను తీస్తానని అన్నారు.భారతదేశం సుభిక్షంగా ఉండాలంటే ఏం చేయాలన్నదే ‘జనగణమన’ స్టోరీలైన్ అని చెప్పారు.మ‌రి ఇప్ప‌టికైనా మ‌హేష్ ఈ సినిమాపై త‌న మాట బ‌య‌ట‌పెడాతాడో లేక ఈ సినిమా మ‌రో హీరో చేతుల‌లోకి వెళ్లుతుందో చూడాలి.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -