- అమీర్ఖాన్తో సినిమాలో నటించడంపై మానుషి ఆసక్తి
అందంతోనే కాదు తన సమాధానాలు, వాక్పటిమతో అందరీ అభిమానాలు చూరగొన్నమానుషి చిల్లర్ ప్రపంచ సుందరిగా అవార్డు పొందడానికి కారణాలుగా నిలిచాయి. మానుషి చిల్లర్ ఆ తర్వాత దేశాభిమానాలు పొందింది. అవార్డు పొందిన అనంతరం తొలిసారి ఆమె ఓ కార్యక్రమంలో పాల్గొంది. ముంబైలో సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడింది. అందమంటే శారీరక సౌందర్యం కాదు.. మానసిక సౌందర్యమన్నారు. భారత్లో మహిళలందరూ ఒకే రకమైన సమస్య ఎదుర్కొంటున్నారని, స్నేహాహపూర్వక సమాజాన్ని కోరుకుంటున్నట్లు చెప్పారు. బాలీవుడ్ మూవీ ‘పద్మావతి’ పెను వివాదంలో చిక్కుకున్నా.. వాటిని ధైర్యంగా ఎదుర్కొంటున్న నటి దీపికా పదుకొనేను చూసి ఎందరో మహిళలు ప్రేరణ పొందే అవకాశం ఉందని అభిప్రాయపడింది.
ఇంకా సినిమా పరిశ్రమ గురించి కూడా ప్రస్తావించింది. ప్రస్తుతానికి తాను సినిమా తెరపై నటించాలనే ఆశలేదని ప్రకటించింది. అయితే బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్ట్ ఆమీర్ ఖాన్తో కలిసి నటించాలని ఉందని ప్రపంచ సుందరి తెలిపారు. ఆమీర్ చాలెంజింగ్ పాత్రలు ఎంచుకుని సమాజానికి ఏదో రూపంలో మంచి సందేహాన్ని ఇస్తారని కొనియాడారు. ఆయన ఎంతో క్లిష్టమైన పాత్రలు ఎంచుకుని సమాజానికి ఏదో రూపంలో మంచి సందేహాన్ని ఇస్తుంటారని ఆమె కొనియాడారు. హీరోయిన్లలో మాజీ ప్రపంచ సుందరి ప్రియాంక చోప్రాను అభిమానిస్తానని చెప్పారు. హరియాణాకు చెందిన 20 ఏళ్ల ‘మిస్ ఇండియా’ మానుషి ఛిల్లర్ ఇటీవల జరిగిన పోటీల్లో మిస్ వరల్డ్ 2017 టైటిల్ను సాధించి భారతదేశ ఖ్యాతిని చాటిచెప్పిన విషయం తెలిసిందే.