Tuesday, May 14, 2024
- Advertisement -

జ‌న‌తా గ్యారేజ్ స్టోరీ ఇదే!

- Advertisement -

యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ అభిమానులకు శుభ‌వార్త‌. అభిమానులు ఎంతగానో ఎదురు చూసిన జనతా గ్యారేజ్ ఫస్ట్ లుక్ స్టిల్స్, టీజర్ బయటకు వచ్చాయి. కానీ ఈ చిత్రం కథ ఎలా ఉంటుందో మాత్రం  అవ‌గాహ‌న లేదు. అయితే ఇంతకి జనతా గ్యారేజ్ స్టోరీ ఎలా ఉంటుంది? మోహన్ లాల్‌కి, ఎన్టీఆర్‌కి సంబంధం ఏంటి? సమంతా, నిత్యామీనన్ క్యారెక్టర్స్ ఏంటి ? ఇలా అన్నీ సందేహాలే.. అయితే ఇప్పుడు ఈ చిత్రాన్నికి సంబంధించి ఓ స్టోరీ ఫిల్మ్ ఇండస్ట్రీలో హల్ చల్ చేస్తోంది.

ఇక ఈ చిత్రంలో మెయిన్ విలన్ గా ఉన్నిముకుందన్ నటిస్తున్నాడు. ఇతని మోహన్ లాల్ కుమారుడు. మోహన్ లాల్ అన్నయ్య కొడుకు హీరో ఎన్టీఆర్. మోహన్ లాల్ హైదరాబాద్‌లో జనతా గ్యారేజ్‌ని నడుపుతూ ఉంటాడు. ఎన్టీఆర్ ఐఐటీ స్టూడెంట్. కాలేజ్ రోజుల్లో నిత్యామీనన్‌తో ప్రేమలో పడతాడు. మోహన్ లాల్‌కి ఎన్టీఆర్ పైన ఉన్న ప్రేమే కొడుకు ఉన్ని ముకుందన్‌ని దూరం చేస్తుందట. అయితే విలన్ ఎవరన్న సస్పెన్స్ చివరిదాకా ఉంటుందని స‌మాచారం.

అయితే పవర్ కోసం ఉన్ని ముకుందన్నేస‌మ‌స్య‌లు సృష్టిస్తున్నాడ‌ని ఎన్టీఆర్‌కి తెలిసి షాకవుతాడట. ఉన్ని ముకుందన్ నిత్యామీనన్‌కి కూడా స‌మ‌స్య‌లు క్రియేట్ చేస్తాడట. నిత్యామీనన్ స్టోరీ ఏంటో తెలియదు కానీ నిత్యామీనన్ ప్రాబ్లమ్, ఎన్టీఆర్ ప్రాబ్లమ్ ఒకటే అవుతుందట. ఆ తర్వాత ఎన్టీఆర్ ఏమ్ చేసాడు? అనేది అసలు కథ. ఇదే జనతా గ్యారేజ్ కథ అని ఫిల్మ్ నగర్‌లో న్యూస్ హ‌డావుడి చేస్తోంది. అసలు కథ తెలియాలి అంటే ఆగ‌స్టు 12 వేచి చూడాల్సిందే. 

Related

  1. ఎన్టీఆర్ కు మోహన్‌ లాల్ తలనొప్పి!
  2. టీజర్ తో అదరగొట్టిన ఎన్టీఆర్
  3. ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ ఆడియో ఎప్పుడంటే ..
  4. బాలకృష్ణ కి భయపడిన ఎన్టీఆర్ ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -