ప్రస్తుతం ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ రిలీజ్ కు ముందే రికార్డులు సృష్టిస్తోంది. జనతా గ్యారేజ్ సినిమాకి సంబంధించి టీజర్ ను ఇటివలే రిలీజ్ చేశారు. ఈ టీజర్ ప్రస్తుతం సెన్సేషన్ క్రియేట్ చేసింది. అతి తక్కవ టైంలో ఎక్కవ మంది చూసిన టీజర్గా రికార్డు క్రియేట్ చేసింది జనతా గ్యారేజ్. మిర్చి, శ్రీమంతుడు వంటి సినిమాలు తీసిన దర్శకుడు కొరటాల శివ ఈ చిత్రాన్నికి దర్శకత్వం వహించడం విశేషం. ఇక ఈ చిత్రాన్ని ఆగష్టు 12న గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
అయితే ఇప్పుడు ఈ చిత్ర యూనిట్కు మోహన్ లాల్ రూపంలో అనుకోని ఇబ్బంది ఏర్పడింది. ఈ చిత్రంలో మోహన్ లాల్ ఓ ముఖ్య పాత్రలో కనిపించబోతున్న విషయం తెలిసిందే. కావున ఈ చిత్రాన్నికి తెలుగుతో పాటు మళయాలంలోనూ కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే గ్యారేజ్ రైట్స్ను సొంతం చేసుకుని సినిమాను తనే స్వయంగా మళయాలంలో విడుదల చేస్తున్నారు మోహన్ లాల్. అయితే డబ్బింగ్ పనులు జరుపుకుంటున్న జనతా గ్యారేజ్లో మోహన్ లాల్ క్కారెక్టర్కు తానే స్వయంగా డబ్బింగ్ చెప్పాలని చూస్తున్నారు.
అయితే ఆయన వాయిస్ తెలుగులో అంత పర్ఫెక్ట్గా రదని ఆలోచనలో పడ్డారు చిత్ర యూనిట్. ఇటీవల విడుదలైన మనమంతా టీజర్లో మోహన్లాల్ చెప్పిన తెలుగు డైలాగులు అంత స్పష్టంగా లేకపోవడంతో గ్యారేజ్ టీమ్ ఆలోచనలో పడ్డారట. మరి మోహన్ లాల్ పాత్రకు డబ్బింగ్ తానే చెబుతారా లేక వేరే వారితో చెప్పిస్తారా అనే విషయం తెలియాలి అంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. ఏదేమైనా మోహన్ లాల్ డబ్బింగ్ మొత్తం జనతా గ్యారేజ్ టీమ్కు తలనొప్పిగా మారింది అని అంటున్నారు చిత్ర యూనిట్.
Related