జీవజ్యోతి జీవితం ఆధారంగా ఓ సినిమా తెరకెక్కబోతున్నట్టు సమాచారం. కొన్నేళ్ల క్రితం పత్రికల్లో జీవజ్యోతి పేరు మారుమోగిపోయింది. ఆమె చేసిన పోరాటాన్ని కథలు కథలుగా చెప్పుకున్నారు. ఆమె జీవితాన్ని ఎందరో ఆదర్శంగా తీసుకున్నారు. ప్రస్తుతం ఆమె కథ ఆధారంగా ఓ సినిమా తెరకెక్కబోతుండటంతో మళ్లీ జీవజ్యోతి వార్తల్లో నిలిచారు. అసలు ఈ జీవజ్యోతి ఎవరు? ఆమె జీవితంలో ఎటువంటి కష్టాలు ఎదుర్కొన్నారు? తదితర వివరాలు తెలుసుకుందాం..
జీవజ్యోతి తమిళనాడులోని ప్రముఖ హోటల్ శరవణ భవన్లో కార్మికురాలిగా పనిచేసేవారు. ఆ హోటల్ యజమాని పేరు రాజగోపాల్. ఆయన ముందుగా ఓ చిన్న హోటల్గా శరవణ భవన్ను స్థాపించారు. ఆ తర్వాత ఆయన వంటలు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఫేమస్ అయిపోయాయి. ఆయన వ్యాపారం అంచెలంచెలుగా ఎదిగింది. రాజగోపాల్ పెద్ద వ్యాపారవేత్తగా ఎదిగారు. విదేశాల్లోనూ ఆయన హోటళ్లు స్థాపించి కోటీశ్వరుడయ్యాడు.
ఇదిలా ఉంటే రాజగోపాల్కు జాతకాల పిచ్చి ఎక్కువ. తన హోటల్లో పనిచేసే శివజ్యోతి అనే ఆమెను పెళ్లిచేసుకుంటే మంచి జరుగుతుందని .. వ్యాపారంలో మరింత రాణిస్తావని ఓ జ్యోతిష్యుడు చెప్పాడు. నిజానికి శివజ్యోతికి అప్పటికే వివాహం అయ్యింది. అయినప్పటికీ రాజగోపాల్ ఆమెను వివాహం చేసుకోవాలని భావించాడు. ఆమె వద్ద ఈ విషయం ప్రస్తావించగా ఆమె పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో శివజ్యోతి భర్త ప్రిన్స్ను రాజగోపాల్ 2001లో దారుణంగా హత్యచేయించాడు. దీంతో శివజ్యోతి రాజగోపాల్పై కేసు పెట్టింది. ఈ కేసు అప్పట్లో సంచలనంగా మారింది.
చెన్నై హైకోర్టు రాజగోపాల్ కు పదేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే ఈ శిక్షను సవాలు చేస్తూ రాజగోపాల్ సుప్రీంకోర్టుకు వెళ్లాడు. కేసు పూర్వా పరాలు పరిశీలించిన సుప్రీంకోర్టు.. రాజగోపాల్ చేసిన నేరానికి పదేళ్ల జైలు శిక్ష చాలదంటూ అతడికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఈ తీర్పు అప్పట్లో సంచలనంగా మారింది. శివజ్యోతి చేసిన పోరాటాన్ని అంతా మెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆమె జీవిత చరిత్ర ఆధారంగా జంగిల్ పిక్చర్స్ సంస్థ ఓ సినిమా నిర్మించబోతున్నది.
ఈ విషయంపై శివజ్యోతి మాట్లాడుతూ.. నా జీవితంపై ఓ సినిమా రావడం ఎంతో సంతోషకరం. పురుషాధిక్య సమాజంలో ఎన్ని కష్టాలు ఉంటాయో ప్రేక్షకులు తెలుసుకొనే అవకాశం ఉంటుంది’ అంటూ ఆమె వ్యాఖ్యానించారు.
Also Read
బిగ్ బాస్ హోస్ట్గా చేసేందుకు నో చెప్పిన రానా..!
ఎమ్మెల్యేగా ఓడిపోయినా.. కేంద్రమంత్రి పదవి..లక్అంటే ఈయనదే..!