కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ కేజీఎఫ్ ఛాప్టర్2. 2018లో విడుదలైన కేజీఎఫ్కు సీక్వెల్గా వచ్చిన ఈ మూవీపై ప్రముఖులు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఈ మూవీ చూసిన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కు ఫోన్ చేసి ప్రసంశల జల్లు కురిపించారు.
ఈ విషయం స్వయంగా నీల్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. యష్ను తెరపై చూపించిన తీరు అద్భుతమంటూ నీల్ దర్శకత్వ ప్రతిభను కొనియాడారు టాలీవుడ్ స్టార్స్. ప్రపంచవ్యాప్తంగా 10వేల స్క్రీన్స్పై ఈ సినిమా విడుదలైంది. భారత్లో 6వేలు, దక్షిణాదిలో 2600 థియేటర్లలో విడుదల చేశారు.
దాదాపు వంద కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన కేజీఎఫ్ చాప్టర్ 2 సుదీర్ఘ కాలంపాటు వెయిట్ చేయించిన అనంతరం ఏప్రిల్ 14న విడుదలైంది. యష్కు జోడీగా శ్రీనిధి శెట్టి నటించింది. బాలీవుడ్ నటులు సంజయ్ దత్, రవీనా టాండన్ లతోపాటు ప్రకాష్రాజ్, రావు రమేష్, ఈశ్వరీ రావు తదితరులు కీలక పాత్రలు పోషించారు.
50 ఏళ్ళ దగ్గర పడుతున్న పెళ్లి చేసుకోని హీరోయిన్స్ వీరే..!