- Advertisement -
నందమూరి కల్యాణ్ రాం హీరోగా మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా వస్తున్న సినిమా ‘నా నువ్వే’. ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేశారు చిత్ర యూనిట్. ట్రైలర్ చూస్తుంటే అర్థం అవుతుంది, ఈ సినిమా పూర్తి లవ్ స్టోరి అని. ఈ సినిమాలో కల్యాణ్ రామ్ గతంలో ఎన్నాడూ కనిపించనంత సాఫ్ట్ అండ్ రొమాంటిక్ లుక్ లో దర్శనమిస్తున్నాడు.
రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాను మహేష్ కోనేరు, విజయ్ వట్టికూటి, కిరణ్ ముప్పవరపులు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.తమిళ దర్శకుడు జయేంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మే 25న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.