వరుస చారిత్రక చిత్రాలపై దర్శకుడు క్రిష్ దృష్టి సారిస్తున్నాడు. ఈసారి అదే చారిత్రక కథాంశంతో బాలీవుడ్కు వెళ్లాడు. కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో ఝాన్సీ లక్ష్మీభాయి జీవిత చరిత్రపై మణికర్ణిక సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. ఇటీవల ఈ సినిమా మొదటి లుక్ను కూడా విడుదల చేశారు. ఈ లుక్తో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. సంజయ్లీలా బన్సాలీ మాదిరిగా క్రిష్ అయ్యాడని పలువురు సినీ ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు. అయితే ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్న కంగనా రనౌత్ తరచూ గాయపడుతున్నారు. ఝాన్సీ లక్ష్మీభాయ్ అంటే ప్రధానంగా యుద్ధాలే ఉన్నాయి. అందుకే యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరణలు చేస్తున్నారు.
యాక్షన్ సన్నివేశాల సమయంలో కంగనా గాయాలకు గురవుతోంది. అయితే ఈ మంగళవారం (నవంబర్ 22న) కూడా తనకు బలమైన గాయాలయ్యాయి. 40 అడుగుల గోడపై ఝాన్సీలక్ష్మీభాయి మేనల్లుడు దామోదార్ను మోసుకెళ్తూ దూకాల్సిన సన్నివేశాన్ని తీస్తున్నారు. ఆ విధంగా చిత్రీకరణ చేస్తుండగా ఆమె గాయాలపాలయ్యారు. కంగనా కుడికాలుకు చాలా గాయమైంది. వెంటనే సినిమా బృందం ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆమెకు బలమైన గాయమైందని, కొన్ని వారాల పాటు విశ్రాంతి కావాలని వైద్యులు తెలిపినట్టు తెలుస్తోంది. జోధ్పూర్ కోటలో జరుగుతున్న చిత్రీకరణలో భాగంగా ఆమె గాయపడింది. గుర్రంపై నుంచి దూకాల్సిన సన్నివేశం తీస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
అయితే ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. రూ.70 కోట్లతో ఈ సినిమాను తీస్తున్నారు. గతంలో హైదరాబాద్లో షూటింగ్ జరుగుతున్నప్పుడు కంగన కంటికి గాయమైంది.
https://www.youtube.com/watch?v=tn66yOluSk8