సినీ విమర్శకుడు, నటుడు, బిగ్ బాస్ ఫేమ్ కత్తి మహేశ్కు చెన్నై-కలకత్తా రహదారిపై శనివారం తెల్లవారు ఝామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. అయితే కత్తి మహేశ్ తలకు తీవ్ర గాయాలు కావడంతో అతన్ని చికిత్స నిమిత్తం నెల్లూరులోని మెడికవర్ కార్పొరేట్ హాస్పిటల్కు తరలించారు. మహేశ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, వెంటిలేటర్పై ఆయనకు చికిత్స కొనసాగుతున్నట్లు వైద్యులు తెలిపారు.
ఇదిలా ఉంటే.. ప్రమాదంలో కత్తి మహేష్ కు స్వల్ప గాయాలు అయ్యాయి అని ముందు వార్తలు బయటకు వచ్చాయి. ఇన్నోవాలో ఉన్న ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో ఆయనకు పెద్దగా గాయాలు కాలేదని భయపడాల్సింది ఏమీ లేదని ఆయన సన్నిహితులు చెబుతున్నట్టుగా సోషల్ మీడియాలో కూడా ప్రచారం జరిగింది. కానీ ప్రమాదంలో ఆయన తలకు తీవ్ర గాయాలు కావడంతో పాటు కళ్లకు కూడా గాయాలయ్యాయని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే ఆయన కంటికి కూడా తీవ్ర గాయాలు కావడంతో నెల్లూరులో ఉన్న మెడికవర్ హాస్పిటల్ లో ఆయన కళ్ళకు శస్త్రచికిత్స కూడా చేశారని అంటున్నారు. కాగా, ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతానికి విషమంగానే ఉందని అంటున్నారు. ఇక ఇప్పుడే పరిస్థితి ఏమీ చెప్పలేమని మరికొన్ని గంటలు ఆగితే గాని ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో అనే విషయం మీద ఒక హెల్త్ బులిటెన్ రిలీజ్ చేయలేమని వైద్యులు చెబుతున్నారు అని తెలుస్తోంది.
నా బయోపిక్ తీస్తే అతడే హీరో.. రైనా