కృష్ణ జింకలను వేటాడిన కేసులో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ దోషిగా తేలడంతో ఆయన అభిమానలు తీవ్ర నిరాశలో ఉన్నారు.ఇరవై సంవత్సరాల నుంచి విచారణలో ఉంది ఈ కేసు. అనేక మలుపుల అనంతరం, సల్మాన్ ను జోధ్పూర్ కోర్టు దోషిగా తేల్చింది.సల్మాన్కు రెండు సంవత్సరాల జైలు శిక్ష పడింది.అయితే శిక్షపై పై కోర్టుకు అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది. ఈ రోజు ఉదయం సల్మాన్ కోర్టుకు వెళ్లకముందు హీరోయిన్ కత్రినాకైఫ్ గుడికి వెళ్లి ప్రత్యేక పూజలు చేయడం గమనార్హం.ఒకప్పుడు సల్మాన్ కు ప్రేయసిగా చలామణి అయ్యింది కత్రినా.
ఇండస్ట్రీలో ఆమె స్టార్ హీరోయిన్గా చాలామణీ అవుతుదంటే దానికి ప్రధాన కారణం సల్మాన్ ఖానే.సల్మాన్ నిర్ధోషిగా బయటకి రావలని కత్రినా పూజలు చేశారు.గతంలో సల్మాన్ జైలులో ఉన్నప్పుడు కత్రినా అక్కడకి వెళ్లి మరి కలిసి వచ్చిన సంఘటనలు చాలానే ఉన్నాయి.ముంబైలోని సిద్ధి వినాయక ఆలయానికి వెళ్లి కత్రినాకైఫ్ పూజలు చేసింది. కత్రినాతో పాటు సల్మాన్ చెల్లెలు కూడా గుడికి వెళ్లింది.కాని ఆమె పూజలు ఫలించలేదు సల్మాన్కు రెండు సంవత్సరాల జైలు శిక్ష పడింది.దీనిపై సల్మాన్ మాజీ ప్రేయసి కత్రినా ఎలా స్పందిస్తుందో చూడాలి.