రామ్ హీరోగా నటించిన నేను శైలజా సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది కీర్తి సురేష్. ఈ సినిమా తరువాత అమ్మడికి తెలుగులో చాలానే అవకాశాలు వచ్చాయి.కాని అలనాటి తార సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన మహనటి సినిమాతో స్టార్ హీరోయిన్ల కన్నా ఎక్కువ ఫేమస్ అయింది కీర్తి సురేష్.ఈ సినిమాలో ఆమె నటనకు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందాయి.ఇక ఆమె ప్రస్తుతం తమిళంలో మూడు సినిమాలలో నటిస్తు బిజీగా ఉంది.విజయ్ ,విశాల్,విక్రమ్ వంటి స్టార్ హీరోలతో నటిస్తుంది కీర్తి సురేష్.
మహనటి సినిమా తరువాత ఏ బయోపిక్ తీస్తున్న మొదటి వినిపిస్తున్న పేరు కీర్తి సురేదే.తమిళనాడు మాజీ సీఎం జయలలిత బయోపిక్ను తెరకెక్కిస్తున్నారనే వార్తలు గత కొన్ని రోజులుగా వస్తున్నాయి.ఈ బయోపిక్లో కీర్తిని తీసుకున్నారని సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తుంది.అయితే ఈ వార్తలపై హీరోయిన్ కీర్తి సురేష్ స్పందించింది.ఇంతవరకూ ఈ పాత్రను గురించి నన్ను ఎవరూ సంప్రదించలేదు. జయలలితగారు గొప్పనటి .. అంతకు మించిన గొప్ప నాయకురాలు. అలాంటి జయలలిత గారిలా నటించడం అంత తేలికైన విషయం కాదు .. అంత ధైర్యం కూడా నాకు లేదు” అన్నారు.