ఇండియన్ -2 ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించారు. శంకర్ దర్శకత్వంలో కమల్హాసన్ హీరోగా ఎంతో గొప్పగా తెరకెక్కించాలని ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా భావించింది. ఇక ప్రేక్షకుల్లోనూ ఈ చిత్రం పట్ల భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ ఆ చిత్రానికి మొదటి నుంచి ఆటంకాలే ఎదురయ్యాయి. ఇక నిర్మాణ సంస్థకు దర్శకుడు శంకర్కు విబేధాలు రావడం.. వివిధ కారణాలతో ఈ మూవీ మధ్యలోనే ఆగిపోయింది. అయితే లైకా సంస్థ కోర్టుకు వెళ్లింది. తమ చిత్రాన్ని శంకర్ ఆర్ధాంతరంగా ఆపేశారని.. ఆయన ఈ చిత్రం పూర్తి చేసేవరకు … మరే ఇతర చిత్రాలు చేయకుండా స్టే విధించాలని లైకా సంస్థ కోర్టుకు వెళ్లింది.
కానీ శంకర్ మాత్రం వివిధ ప్రాజెక్టులను ఒప్పుకున్నారు. అపరిచితుడు చిత్రాన్ని హిందీలోకి రీమేక్ చేస్తున్నాడు. అంతేకాక ప్రముఖ టాలీవుడ్ హీరో రాంచరణ్తేజ్తో ఓ భారీ పాన్ ఇండియా మూవీని తెరకెక్కించాలని చూస్తున్నాడు. ఈ కేసు తాజాగా విచారణకు వచ్చింది. బుధవారం కేసు విచారించిన మద్రాస్ హైకోర్టు ఆసక్తికరమైన తీర్పు ఇచ్చింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఓ మాజీ న్యాయమూర్తిని నియమించింది.
లైకా సంస్థకు దర్శకుడు శంకర్కు మధ్య ఉన్న సమస్యను పరిష్కరించాలంటూ ఆ బాధ్యతను విశ్రాంత న్యాయమూర్తి భానుమతికి అప్పగించింది. ఇరు వర్గాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపించాలని సూచించింది. విశ్రాంత న్యాయమూర్తి ఎటువంటి పరిష్కారం చూపిస్తోందో వేచి చూడాలి.
ఇక ఈ సినిమా ఆగిపోవడంతో కమల్హాసన్ కొన్ని వేరే చిత్రాలు చేస్తున్నాడు.ఆయన ప్రస్తుతం దృశ్యం రీమేక్లో నటిస్తున్నాడు. శంకర్ సైతం కొన్ని ఇతర ప్రాజెక్టులు ఒప్పుకున్నాడు. ఈ క్రమంలో మాజీ న్యాయమూర్తి ఈ సమస్యను ఎలా పరిష్కరించబోతున్నారో వేచి చూడాలి.
Also Read