అల్లు అర్జున్ రీసెంట్గా వచ్చిన సినిమా నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా అనుకున్నంత విజయం సాధించలేదు.దీంతో తన తరువాత సినిమాపై మరింత ఫోకస్ పెట్టాడు బన్నీ.విక్రమ్ కుమార్తో సినిమా చేద్దాం అని డిసైడ్ అయ్యాడు.దీని తరువాత పెద్ద దర్శకులతో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడు బన్నీ.తనకు రేసుగుర్రం లాంటి హిట్ ఇచ్చిన సురేందర్ రెడ్డితో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.
అయితే సురేందర్ రెడ్డిప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో సైరా మూవీ తీస్తున్నాడు.ఇక అల్లు అర్జున్ చేయలని అనుకుంటున్న మరో పెద్ద దర్శకుడు త్రివిక్రమ్.బన్నీతో అంతకముందు జులాయి,సన్నాఫ్ సత్యమూర్తి రెండు సినిమాలు చేశాడు త్రివిక్రమ్.అయితే త్రివిక్రమ్ కూడా ఎన్టీఆర్ మూవీతో బిజిగా ఉన్నాడు.వీరిద్దరిలో ఎవరు సినిమా ముందు పూర్తి అవుతుందో వాళ్లతో సినిమా స్టార్ట్ చేసేందుకు బన్నీ సిద్ధంగానే ఉన్నాడు. ఈలోపు విక్రమ్ సినిమాను పూర్తి చేయలని భావిస్తన్నాడు బన్నీ.
అయితే స్టార్ దర్శకుడు కొరటాల శివతో మూవీ అనుకున్న,ఎందుకనో బన్నీతో సినిమా చేయడానికి కొరటాల ఆసక్తిగా లేడని తెలుస్తుంది.మెగా హీరోలతో సినిమా చేయలంటే చాలామందికి కథ వినిపించాలనే టాక్ ఎప్పటి నుండో ఉంది.పైగా కథలో వారి జోక్యం కూడా ఎక్కువుగా ఉంటుందని బయట టాక్.దీంతోనే బన్నీతో కొరటాల మూవీని ఆపేశారని సమాచారం.మరి ఈ వార్తల్లో నిజం ఎంత వరకు ఉందో తెలియాల్సి ఉంది.