టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన 30 వ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్నట్లు ఇదివరకే ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన జనతా గ్యారేజ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. ఈ క్రమంలోనే ఈ కాంబినేషన్ పై ప్రేక్షకులు మరెన్నో అంచనాలు పెట్టుకున్నారు.
కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓ స్టూడెంట్ పాత్రలో నటిస్తున్నట్లు ఇదివరకే చిత్రబృందం ప్రకటించింది. అయితే ఈ సినిమాలో తారక్ సరసన నటించడం కోసం హీరోయిన్ ఎవరా అనే ఆత్రుత అభిమానులలో నెలకొంది. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ కి సంబంధించిన విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Also read:సంక్రాంతికి రిలీజ్ అయ్యేది రెండు సినిమాలే..?
ఎన్టీఆర్- శివ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటిస్తుందని సమాచారం ఇన్నిరోజులు వినిపించింది. తాజాగా ఈ సినిమాలో నటించడం కోసం కియారా గ్రీన్ సిగ్నల్ ఇస్తూ సంతకం చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాగానే మొదటి షెడ్యూల్ షూటింగ్ లో ఈమె పాల్గొంటున్నట్లు సమాచారం. కియారా అద్వానీ ఇదివరకే కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన భరత్ అనే నేను సినిమాలో నటించి మంచి విజయాన్ని అందుకుంది.ఈ క్రమంలోనే ఎన్టీఆర్ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కరోనా పరిస్థితులు సద్దుమణిగిన వెంటనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభించనుందని చిత్రబృందం తెలియజేస్తున్నారు.