టాలీవుడ్ లో దర్శకుడు కృష్ణవంశీ కి ఎలాంటి గుర్తింపు ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. “గులాబీ”, “ఖడ్గం”, “నిన్నే పెళ్ళాడతా” వంటి కొత్త తరహ సినిమాలు తీసి.. తెలుగు ప్రేక్షకులకు అందించాడు ఈ క్రియేటివ్ డైరెక్టర్. ఇది ఇలా ఉంటే ఈయన ఈ మధ్య వరస ప్లాప్లతో డీలా పడ్డాడు.
కృష్ణవంశీ దర్శకత్వంలో సందీప్ కిషన్ మరియు సాయి ధరం తేజ్ హీరోలుగా వస్తున్న చిత్రం “నక్షత్రం”. ఈ మూవీపై కృష్ణవంశీ చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ రీసెంట్ గా రిలీజ్ అయింది. ఇప్పటికే తెలుగు ప్రేక్షకులకు ఈ టీజర్ విపరీతంగా నచ్చేసింది. కృష్ణవంశీ తాజాగా ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ “ఆ హీరోయిన్ లో నా భార్యను చూశాను అని అన్నారు”. ఇంతకీ ఎవరు ఆ హీరోయిన్ అని అనుకుంటున్నారా.. ఎవరో కాదండీ హాట్ బ్యూటీ రెజినా కేసండ్రే.
{loadmodule mod_custom,Side Ad 1}
ఇక “నక్షత్రం” సినిమా గురించి తెలుసుకుంటే పోలీసు అవ్వాలనుకునే ఒక కుర్రాడు చుట్టూ ఈ కథ తిరుగుతుందని అన్నారు కృష్ణ వంశీ. ఆయన రెజినా క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ ” ఆమెతో పని చేస్తున్న మొదటి రోజు నుండి నాకు ఆమెలో యంగ్ రమ్యకృష్ణ కనబడిందని ఆమెలో ఆ యాంగిల్ నచ్చి ఆమె పాత్ర మరింత అద్భుతంగా తీర్చిదిద్దినట్లు చెప్పారు. ఇది ఇలా ఉంటే రెజినాలో కృష్ణవంశీ రమ్యకృష్ణను చూశాను అనడం ఆశ్చర్యంగా ఉన్నా ఆమె అభినయం చూశారా లేక అందాన్ని చూశారా అని మాత్రం క్లారిటీగా చెప్పలేదు. ఏది ఏమైనా ఈ సినిమాలో రెజినా పాత్రపై అంచనాలు పెరిగిపోయాయి. మరి ఎంతవరకు రెజీనా పాత్ర ఆకట్టుకుంటుందో చూడాలి.
{loadmodule mod_sp_social,Follow Us}
{youtube}YvIQ_x-tA0Y{/youtube}
Related