గతంలో మోహన్బాబు కు అల్లు అరవింద్ కు మధ్య కొన్ని గొడవలు జరిగాయి. మోహన్బాబు చాలా సార్లు అరవింద్పై ఓపెన్గానే విరుచుకుపడిన విషయం తెలిసిందే. అక్కడ నుంచి మంచు ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి పెద్దగా మాటలు లేవు. అయితే ఇప్పుడు మోహన్బాబు, అరవింద్ వారసుల మధ్య ఓ ఫైటింగ్ జరిగింది.
అసలు ఏం జరిగిందో వివరాల్లోకి వెళ్తే… రీసెంట్ జరిగిన సైమా అవార్డ్ల వేడుకలో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న మంచు లక్ష్మి వద్ద అల్లు శిరీష్ ఇంగ్లిష్ పాఠాలు నేర్చుకున్నాడు. ఓ అమ్మాయి తనకు ఫేస్బుక్లో పరిచయం అయ్యిందని మంచు లక్ష్మితో అన్నాడు. వెంటనే మంచు లక్ష్మి ‘నీ ఫొటోయే పెట్టావా?’ అని సటైర్ వేయడంతో బన్నీ ఫొటో పెట్టి ఆ అమ్మాయిని పడగొట్టాను అని శిరీష్ చెప్పాడు. చాట్ చేస్తున్నంత సేపు బాగానే ఉంది కానీ.. ఆ అమ్మాయి ‘లెట్స్ టాక్ ఇన్ ద ఫోన్’ అనగానే భయం పట్టుకుందని శిరీష్ అన్నాడు.
ఆమెతో అమెరికన్ ఇంగ్లిష్ ఎలా మాట్లాడాలో నేర్పించాలి అంటూ మంచు లక్ష్మి ని అడిగాడు శిరీష్. దాంతో ‘వాటర్’, ‘ఐ లవ్ యూ’ అన్న పదాలను పలకడమెలాగో చెప్పింది మంచు లక్ష్మి. కొన్ని పదాల మధ్య తేడాను తెలిపింది. ఆ తర్వాత వెంటనే మీతో రెండు ముక్కలు నేర్చుకుని మొత్తం అమెరికన్ యాక్సెంట్ని పట్టేశానని శిరీష్ అన్నాడు. ఇది ఫంక్షన్కు వచ్చిన వారందరినీ నవ్వుల్లో ముంచెత్తింది.
Related