రామ్ గోపాల్ వర్మ అంటే వివాదలకు మారు పేరు అని చెప్పాలి. తాను తీసే సినిమాలనే వివాదాలుగా మలచడంలో రామ్ గోపాల్ వర్మకు ఎవరు సాటిరారు. అదేవిధాంగా తన సినిమాలను ప్రమోట్ చేయడంలో కూడా రామ్ గోపాల్ వర్మలా ఎవరు చేయలేరని జగమెరిగన సత్యం. వర్మ తాజాగా తెరకెక్కించిన సినిమా లక్ష్మీస్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ జీవితంలోకి ఆమె రెండో భార్య లక్ష్మి పార్వతి ఎంటర్ అయిన దగ్గర నుంచి ఈ సినిమా మొదలవుతుందని వర్మ తెలిపాడు.
సినిమాలోని పోస్టర్స్ , వెన్నుపోటు సాంగ్తోనే అందరిని దృష్టిని ఆకర్షించాడు వర్మ. తాజాగా ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేశాడు. ముఖ్యంగా ఈ ట్రైలర్ను చూస్తుంటే చంద్రబాబును టార్గెట్ చేసుకుని కట్ చేసినట్లు అనిపిస్తోంది. ఇప్పుడు ఈ ట్రైలర్ సంచలనంగా మారింది.లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ ప్రధాని మోదీ చూస్తున్నట్లుగా ఓ ఫోటోను తన ట్విట్టర్లో షేర్ చేశాడు వర్మ. చంద్రబాబు వెన్నుపోటు సినిమాను మోదీ కూడా చూస్తున్నారన్నట్లుగా ఈ ఫోటోని షేర్ చేశాడు రామ్ గోపాల్ వర్మ. వీరితో పాటు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ,జగన్, కేసీఆర్, కేటీఆర్లు ఈ ట్రైలర్ను చూస్తున్నట్లుగా కొన్ని ఫోటోలను తన ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేశాడు రామ్ గోపాల్ వర్మ.
ఇక్కడ మరో విశేషం ఏమిటంటే తన ట్రైలర్ను తానే చూసుకుంటున్నట్లుగా చంద్రబాబు ఫోటోని కూడా తన అకౌంట్లో పోస్ట్ చేశాడు వర్మ. దీనిని చూసిన నెటిజన్లు సినిమాను ఎలా పబ్లిసిటి చేయాలో రామ్ గోపాల్ వర్మను చూసి నేర్చుకోవాలని చెబుతున్నారు. మొత్తనికి వర్మ తన సినిమాలను ప్రేక్షకులలోకి తీసుకువెళ్లడంలో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ప్రస్తుతనికి అయితే ఈ ట్రైలర్ యూట్యూబ్లో సంచలనం సృష్టిస్తోంది.
- Advertisement -
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ట్రైలర్ను మోదీకి చూపించిన వర్మ
- Advertisement -
Related Articles
- Advertisement -
Most Populer
- Advertisement -
Latest News
- Advertisement -