సావిత్రి జీవిత కథను మహనటిగా తెరకెక్కించిన సంగతి తెలిసిందే.అయితే సినిమా రిలీజ్ అయిన వెంటనే సినిమా చాలా బాగుందని ,సినిమాలో అన్ని నిజాలే చూపించరని తెలిపారు సావిత్రి కుతురు విజయ ఛాముండేశ్వరి.కాని సినిమాలో తన తండ్రి గురించి తప్పుగా చూపించారని ఆరోపించారు జెమిని గణేశన్ మొదటి భార్య కుమార్తె కమలా సెల్వరాజ్.దీంతో మహనటి సినిమా వల్ల జెమిని కుటుంబంలో గొడవలు వస్తున్నాయని కొన్ని వార్తలు కూడా వచ్చాయి.అయితే తాజాగా సినిమాలో కొన్ని తప్పులు చేశారని అంటున్నారు సావిత్రి కుమార్తె విజయ ఛాముండేశ్వరి.
తన అక్క చేసిన వాఖ్యలతో తాను ఏకీభవిస్తానని తెలిపింది.సినిమాలో అమ్మకి మద్యం సేవించడం నాన్న అలవాటు చేసినట్లుగా చూపించడం తప్పే అది నేను ఒప్పుకుంటాను. చిత్ర పరిశ్రమలో సోషల్ డ్రింకింగ్ అనేది కామన్. అమ్మకి కూడా పార్టీల వల్లే మందు అలవాటు అయింది. సినిమాలో అమ్మ, నాన్న కారణంగా తాగినట్లు చూపించారు కలది తప్పు అని తెలిపింది.అలాగే మా కుటుంబం అంత కలిసే ఉంటాము,దీనికారణంగా మా మధ్య ఎలాంటి విభేదాలు రావు. నా అక్కచెల్లెళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోను. మా నాన్న కుటుంబమే నా కుటుంబం కూడా” అని స్పష్టం చేశారు.