హోంబాలే ఫిల్మ్స్ సమర్పణలో క్లీమ్ ప్రొడక్షన్స్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మహావతార్ నరసింహ. ఈ చిత్రానికి అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించారు. క్లీమ్ ప్రొడక్షన్స్ బ్యానర్పై హోంబలే ఫిల్మ్స్ సమర్పణలో శిల్పా ధావన్, కుశాల్ దేశాయ్ చైతన్య దేశాయ్ నిర్మించారు. గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా జూలై 25న ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ చిత్రం అద్భుతమైన విజయాన్ని అందుకొని, భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన యానిమేటెడ్ సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది.
తాజాగా ‘మహావతార్ నరసింహ’ చిత్రానికి మరో అరుదైన గౌరవం దక్కింది. అత్యంత ప్రతిష్టాత్మకమైన 98వ అకాడమీ అవార్డ్స్(Oscars) నామినేషన్ దశకు అధికారికంగా అర్హత సాధించింది ఈ చిత్రం.
ఆస్కార్ ఫైనల్ నామినేషన్స్లోకి వెళ్లాలని సినీ ప్రేక్షకులు కోరుకుంటున్నారు. జనవరి 22, 2026న ఫైనల్ నామినేషన్స్ ప్రకటించనుండగా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
