సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. ” SSMB28 ” వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఏప్రెల్ 28న రిలీజ్ కానుంది. ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తి చేసుకున్నా ఈ మూవీ రెండవ షెడ్యూల్ మరి కొద్ది రోజుల్లో స్టార్ట్ కానుంది. ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ ప్రాజెక్ట్ తరువాత మహేశ్ బాబు దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో నటించనున్న సంగతి తెలిసిందే. గ్లోబ్ ట్రాకింగ్ యాక్షన్ అడ్వంచర్ మూవీ గా తెరకెక్కించబోతున్నట్లు ఇటీవల రాజమౌళి స్పష్టం చేశారు. దీంతో ఈ ప్రాజెక్ట్ పై మరింత హైప్ క్రియేట్ అయింది.
ఇక ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ పైకి వెలుతుదనే దానిపై ఫిల్మ్ సర్కిల్స్ లో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇప్పటికే కంప్లీట్ స్క్రిప్ట్ వర్క్ జరుపుకుంటున్న ఈ ప్రాజెక్ట్.. వచ్చే ఏడాది సమ్మర్ లో గ్రాండ్ గా అనౌన్స్ చేయనున్నారట. ఈ ప్రాజెక్ట్ ను ఏప్రెల్ లో అనౌన్స్ చేసి జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనున్నట్లు సమాచారం. ఇక రాజమౌళి సినిమాలంటే ఖచ్చితంగా రెండు మూడు సంవత్సరాలు షూటింగ్ జరుపుకోవడం గ్యారెంటీ. అయితే మహేశ్ తో తీయబోయే మూవీని మాత్రం వీలైనంతా త్వరగా పూర్తి చేయాలని రాజమౌళి భావిస్తున్నాడట అందులో భాగంగానే 2025 సమ్మర్ లో ఎట్టి పరిస్థితిలో మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకోచ్చేందుకు రాజమౌళి పక్కా ప్లాన్ తో ముందుకు వెళ్లబోతున్నట్లు ఇండస్ట్రీ ఇన్ సైడ్ టాక్. మరి రాజమౌళి ఈ సరైన తన సినిమాను త్వరగా రిలీజ్ చేస్తాడో.. లేదా ఎప్పటిలాగే మూడు నాలుగు సంవత్సరాలు వెయిట్ చేయిస్తాడో చూడాలి.
ఇవి కూడా చదవండి
ఎన్టీఆర్ ను నమ్ముకొని ఆ డైరెక్టర్ తప్పు చేస్తున్నాడా ?