భరత్ అను నేను సినిమా స్టార్టింగ్ దగ్గర నుండి నిత్యం వార్తల్లో నిలుస్తునే ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయలకు సంబంధించిన దానిపై ఈ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి అందరికి తెలిసిందే. అయితే ఈ సినిమా పోస్టర్ దగ్గర నుండి ఫస్ట్ ఓత్,టీజర్ అన్ని వైఎస్ జగన్ని ఫాలోఅవుతున్నట్లు తెలుస్తుంది.టీజర్లోని కొన్ని డైలాగులు జగన్ ఎప్పుడు చేప్పే మాట మీద నిలబడాలి అనే డైలాగ్ జగన్ను గుర్తుకు తెస్తాయి. వైఎస్ జగన్ ప్లెయిన్ ష్టర్ట్ప్ ఎక్కవుగా వేసుకుంటారు.ఇంకా సీఎంగా మహేష్ బాబు కూడా అలాంటి డ్రస్ మెయిన్టైన్ చేయ్యడం ఇక్కడ మరో విశేషం. భరత్ అనే నేను టీం ఉగాది పండుగ నాడు ఓ ఫోటోని విడుదల చేశారు.ఆ ఫోటోలో మహేష్ బాబు పంచె కట్టులో కనిపించి అభిమానులకు కనువిందు చేశాడు.ఇక్కడ కూడా మహేష్ టీం జగన్ను ఫాలో అయినట్లు తెలుస్తుంది.
ఎందుకంటే జగన్ ప్రతి ఉగాది నాడుతో పాటు తెలుగు సంప్రదాయ పండుగులప్పుడు అచ్చ తెలుగు మనిషిలా పంచె కట్టుతో పాటు భుజాన కండువతో కనిపిస్తాడు.ఇక్కడ మహేష్ బాబు కూడా అలానే కనిపించడం విశేషం.చాలామంది అభిమానులు భరత్ అను నేను టీజర్కు వైఎస్ జగన్ ఫోటోస్ , వీడియోలు జోడించి సోషల్మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఏదిఏమైనా భరత్ అను నేను టీం వైఎస్ జగన్ను ఫాలో అవుతున్నట్లు తెలుస్తుంది.సినిమా విడుదలకు ముందే ఇన్ని ఫాలో అయితే సినిమా విడుదల తరువాత ఇంకా ఎన్ని బయట పడతాయో.కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 20న విడుదలకు రెడీ అవుతుంది.ఈ సినిమాలో హీరోయిన్గా బాలీవుడ్ హీరోయిన్గా కైరా అద్వానీ చేస్తుంది.