డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కంబినేషన్లో వచ్చిన పోకిరి చిత్రం ఎన్ని రికార్డులును క్రియేట్ చేసిందో మనకు తెలిసిందే.అయితే ఆ చిత్రం పెద్ద ఫ్లాప్ అని తేల్చేశాడు వివాదల దర్శకుడు రాంగోపాల్ వర్మ .విషయం ఏమిటంటే….పూరీ జగన్నాథ్ ప్రస్తుతం తన తనయుడు ఆకాష్ పూరీ హీరోగా మెహబూబా సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చూసి ఫిదా అయ్యారు.
మెహబూబాతో పోల్చితే పోకిరి ఓ ఫ్లాప్ చిత్రం అంటూ తనదైన శైలిలో పూరీని పొగడ్తలతో ముంచెత్తారు. 971లో భారత్, పాకిస్తాన్ ల మధ్య జరిగిన యుద్ధ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టుగా చిత్రయూనిట్ ఇప్పటికే ప్రకటించింది. ఆకాష్ సరసన నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు సందీప్ చౌతా సంగీతమందిస్తున్నారు. పూరీ తన సొంత బ్యానర్ లో మెహబూబా సినిమాను నిర్మిస్తున్నారు.