- Advertisement -
నితిన్, రాశీ ఖన్నా హీరో,హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం శ్రీనివాస కళ్యాణం.శతమానం భవతి ఫేం సతీశ్ వేగేశ్న దర్శకత్వం వహించిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించారు. ఈ సినిమా టీజర్ను సూపర్ స్టార్ మహేశ్ బాబు చేతుల మీదుగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్,పాటలకు మంచి రెస్పన్స్ రావడంతో సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
రేపు సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకి ఈ ట్రైలర్ ను విడుదల చేయనున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో 70 మంది ఆర్టిస్టులు నటించడం విశేషం. ప్రకాశ్ రాజ్ .. జయసుధ .. రాజేంద్రప్రసాద్ .. ఆమని .. సీనియర్ నరేశ్ ఈ సినిమాలో కనిపించనున్నారు.ఎక్కడికి పోతావు చిన్నవాడా ఫేం నందిత శ్వేత ఈ సినిమాలో రెండో హీరోయిన్గా నటిస్తుంది.ఈ సినిమాను ఆగస్టు 10న విడుదల చేయనున్నారు.