Saturday, April 27, 2024
- Advertisement -

మహేశ్ మొత్తం కథ మార్చేస్తున్నాడా ?

- Advertisement -

సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం తన 28వ సినిమాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియెషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే ఒ షెడ్యూల్ కూడా కంప్లీట్ చేసుకుంది. ఇక దాదాపుగా 13 ఏళ్ల తరువాత మహేశ్ త్రివిక్రమ్ కాంబినేషన్ రిపీట్ అవుతుండడంతో సూపర్ స్టార్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ మూవీకి కి సంబంధించిన సెకండ్ షెడ్యూల్ ప్రస్తుతం హోల్డ్ లో ఉంది. దసరా తర్వతే ప్రారంభం కావల్సిన రెండవ షెడ్యూల్ ఇంతవరకు ప్రారంభం అవలేదు. ఎందుకంటే ఆ మద్య మహేశ్ తల్లి ఇందిరా దేవి మరణించడంతో మహేశ్ కాస్త షూటింగ్ కు గ్యాప్ ఇచ్చారు.

ఇదిలా ఉంచితే ఈ మూవీకి సంబంధించి ప్రస్తుతం కొన్ని రూమర్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ మూవీ స్టోరీ మొత్తాన్ని త్రివిక్రమ్ మార్చేస్తున్నడని, అందుకే షూటింగ్ కాస్త ఆలస్యమౌతున్నట్లు వినికిడి. మొదట ఈ మూవీని కంప్లీట్ యాక్షన్ మూవీగా తెరకెక్కించే విధంగా త్రివిక్రమ్ స్టోరీ సిద్దం చేసుకున్నాడట. అయితే కంప్లీట్ యాక్షన్ స్టోరీ పై మహేశ్ కాస్త నిరాశగా ఉన్నాడట. అందుకే స్క్రిప్ట్ లో కాస్త మార్పులు సూచించడాని, దాంతో త్రివిక్రమ్ చేసేదేమీ లేక కథలో చాలా మార్పులు చేసి..ఫ్యామిలీ యాక్షన్ డ్రామాగా కథను మార్చడట. అందుకే షూటింగ్ ఆలస్యమౌతున్నట్లు ఇండస్ట్రీ లో కొన్ని రూమర్స్ వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వైరల్ అవుతున్న ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియదు గాని ప్రస్తుతం ఇండస్ట్రీతో పాటు సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారాయి. ఇక ఈ మూవీని వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఏప్రెల్ 28 న రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం షెడ్యూల్స్ లో చోటు చేసుకున్నా మార్పుల కారణంగా ఈ మూవీ వాయిదా పడే అవకాశం ఉందట.

ఇవి కూడా చదవండి

చిరు బాలయ్యకు స్ట్రోక్ ఇస్తోన్న తలపతి విజయ్ ?

సూపర్ స్టార్ కృష్ణ ఇకలేరు.. తెలుగు సినీ చరిత్రలో చెరిగిపోని సంతకం !

“RRR 2” జక్కన్న క్లారిటీ.. రెడీ అయిపోండి ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -