ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు మురుగదాస్ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మహేష్ సరసన రకుల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు రెండో షెడ్యూల్ జరుగుతోంది. భారీ బడ్జెట్ తో ఈ సినిమా వస్తుండటంతో ఈ సినిమాపై భారీ క్రేజ్ ఏర్పడింది.
దాంతో ఈ సినిమాని సొంతం చేసుకోవడానికి కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అభిషేక్ పిక్చర్స్ రంగంలోకి ఈ సినిమాని ఏకంగా 65 కోట్లకు రెండు తెలుగు రాష్ట్రాల హక్కులను సొంతం చేసుకుందట. ఇంకా అధికారికంగా ప్రకటించాలి అయితే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం 65 కోట్లకు ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ డిస్ట్రిబ్యుషన్ హక్కులను సొంతం చేసుకున్నారట.
థియేటర్ రైట్స్ కే ఈ రెంజ్ లో వస్తే ఇంకా… తమిళనాడు , కర్ణాటక , ఓవర్సీస్ , సాటి లైట్ , ఆడియో , ఇతరత్రా కలిసి మరో 60 నుంచి 70 కోట్ల బిజినెస్ జరిగే అవకాశాం ఉంది. అంటే 90 కోట్లు పెట్టి తీస్తున్న ఈ సినిమాకి రిలీజ్ కాకముందే 15 నుండి 25 కోట్ల లాభం వచ్చేలా ఉంది.
Related