Friday, April 26, 2024
- Advertisement -

ఇకపై రెగ్యులర్ గా షూటింగ్ అనుకున్న మెగాస్టార్.. అంతలోనే ఇలా

- Advertisement -

దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఎంతో మంది ప్రముఖులు ఈ వైరస్ బారిన పడుతున్నారు. ఇటీవల ఎన్నడూ లేని విధంగా సినీరంగంలోని ఎంతో మంది వైరస్ బారిన పడుతున్నారు. బాలీవుడ్, కోలివడ్, సాండల్ వుడ్ .. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మందే ఉన్నారు.

తాజాగా మెగాస్టార్ చిరంజీవి కరోనా బారిన పడ్డారు. తనకు కోవిడ్19 పాజిటివ్ గా తేలిందని ఆయన ట్వీట్ చేశారు. స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని, ప్రస్తుతం హోం ఐసోలేషన్ లో ఉంటూ చికిత్స పొందుతున్నట్టు తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలి సూచించారు.

కాగా ఇటీవల వరుసగా సినిమా షూటింగ్ లలో పాల్గొనాలని చిరంజీవి నిర్ణయించుకున్నారు. అంతలోనే ఆయన కరోనా బారినపడ్డారు. దీంతో దాదాపు మూడు వారాల పాటు సినిమాలకు విరామం ప్రకటించే అవకాశం ఉంది. చిరంజీవి నటించిన ఆచార్య సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. సెట్స్ పై గాడ్ ఫాదర్ , బోళా శంకర్ సినిమాలు ఉన్నాయి. బాబీ డైరెక్షన్లో ఓ సినిమాకు కమిట్ అయ్యారు.

Also Read: రెండు మూడు వారాల్లో పీక్ లెవల్ కు ఒమిక్రాన్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -