- Advertisement -
కల్యాణ్ రామ్ గత కొంతకాలంగా వరుస ఫ్లాప్లతో ఇబ్బంది పడుతున్నాడు.నిర్మాతగా కూడా వరుస ఫ్లాప్లతో ఉన్న కల్యాణ్ రామ్ కు జైలవకుశ సినిమాతో హిట్ని అందించాడు తారక్.మొన్న ఆ మధ్య వచ్చిన ఎమ్మెల్యే సినిమా ఫర్వాలేదనిపించింది.ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.కల్యాణ్ రామ్ ప్రస్తుతం ‘నా నువ్వే సినిమాతో వస్తున్నాడు.
ఈ సినిమాలో కల్యాణ్ రామ్ పక్కన తమన్నా హీరోయిన్గా చేస్తుంది.’నా నువ్వే’ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఈ సినిమాకు జయేంద్ర దర్శకత్వం వహిస్తున్నారు.ఈ చిత్రాన్ని ఈ నెల 25న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర నిర్మాతలు ప్రకటించారు.ఈ సినిమా సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది.ఈ చిత్రం రన్ టైం ఒక గంట 58 నిమిషాలు వుంటుంది.