హీరో నవదీప్.. జై చిత్రంతో పరిశ్రమకు పరిచయం అయ్యారు. తేజ దర్శకత్వంలో హీరోలకు మంచి క్రేజ్ ఉంటుంది. అయితే.. నవదీప్ హీరోగా నిలదొక్కుకోలేదు. తాను ఎంచుకున్న కథలు కాస్త డిఫరెంట్ రిజల్ట్ వచ్చేలా చేశాయని అంటున్నాడు నవదీప్. ఇక ఇటివలే వచ్చిన ధ్రువ చిత్రంలో హీరోకి సపోర్టింగ్ పాత్ర చేసి సూపర్ అనిపించుకున్న నవదీప్ శ్రీనువైట్ల దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన బాద్ షా చిత్రంలో విలన్ గా అనవసరంగా చేశానని అంటున్నాడు.
స్క్రిప్ట్ దశలో ఆ క్యారక్టర్ బాగా వర్క్ అవుట్ అవుతుందని అనుకున్నానని కాని సినిమాలో చూశాక చేయకుండా ఉండాల్సింది అని అనుకున్నడట నవదీప్. నెగటివ్ పాత్ర కాకపోయినా ఆర్య-2 లో సెల్ఫిష్ గా కనిపించే పాత్రలైనా చేసేందుకు సిద్ధమే అంటున్నాడు నవదీప్. ఆర్య, ధ్రువ సినిమాల్లంటివి ఓకే కాని బాద్షా మాత్రం అనవసరంగా చేశానని ఒప్పుకున్నాడు.
సినిమా మాములుగా ఆడింది కాబట్టి నవదీప్ ఇలా అంటున్నాడు అదే సినిమాకు నవదీప్ కు క్రేజ్ వచ్చుంటే కనుక కచ్చితంగా అప్పుడు వర్షన్ వేరేలా ఉండేది. తెలుగు సినిమా పరిశ్రమలో హీరోలు ఎక్కువవుతున్న టైంలో హీరోగా ఫేడవుట్ అవుతున్న వారందరు సపోర్టింగ్ రోల్స్ గాను విలన్స్ గాను చేస్తున్నారు. ఇప్పటికే నవదీప్ ఈ క్రమలో ముందులో ఉండగా.. యువ హీరోలు నవీన్ చంద్ర, తనీశ్ లు కూడా నెగటివ్ రోల్స్ చేస్తున్నారు. ధ్రువ ఇచ్చిన హిట్ మజాతో నవదీప్ మళ్లీ హీరోగా ట్రై చేస్తాడో లేక విలన్ గా చేస్తాడో లేక సపోర్టింగ్ రోల్స్ చేస్తాడో చూడాలి.
Related