భీమ్లానాయక్ చిత్రం రిలీజ్ డేట్ వాయిదా పడడంతో పవన్ కల్యాణ్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. జనవరి 12న విడుదల కావాల్సి ఉన్న సినిమా ఫిబ్రవరి 25న విడుదల కానుంది. పాన్ ఇండియా సినిమాలు అయిన ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ సినిమాలు సంక్రాంతికి విడుదలు అవుతున్న కారణంగా భీమ్లానాయక్ నిసిమాను వాయిదా వేయాలని కోరిన నిర్మాత సంఘం విజ్ఞప్తి మేరకు సినిమాను వాయిదా వేసిన విషయం తెలిసిందే.
కాగా పవన్ కల్యాణ్ సినిమా విడుదల వాయిదాపై నిరాశకు గురైన ఆయన అభిమానులు రాజమౌళిపై ట్రోల్స్ కూడా చేశారు. నాగబాబు కూతురు నిహారిక స్పందించారు. కూతురిగా కాకుండా ఒక పవన్ అభిమానిగా స్పందిస్తున్నాను అని అన్నారు. ‘బాబాయి సినిమా రావడం ఆలస్యం కావచ్చు కానీ రావడం పక్కా.. బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టడం పక్కా..’ అని చెప్పి పవన్ అభిమానుల్లో జోష్ నింపారు.
అలాగే ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్న రామ్ చరణ్పై ప్రశంసలు కురిపించారు. రామ్ ఎనర్జీ లెవల్స్ చూసి షాక్ అయ్యానని అన్నారు. అలాగే సినిమా టీం అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.