నితిన్, రాశీఖన్నా జంటగా నటిస్తున్న ‘శ్రీనివాస కళ్యాణం’ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.ఇప్పటికే విడుదల చేసిన సినిమా ఫస్ట్లుక్ పోస్టర్కు మంచి స్పందన వచ్చింది.ఈ సినిమాకు సతీష్ విఘ్నేశ్ దర్శకత్వం వహించారు.ఆయన గతంలో శర్వానంద్ హీరోగా శతమానం భవతి సినిమాను తెరకెక్కించారు. ఆ సినిమా మంచి ఫ్యామిలీ హిట్ కావడంతో మరోసారి ఫ్యామిలీ స్టోరీనే ఎంచుకున్నాడు దర్శకుడు సతీష్.మొదటి ఈ సినిమాను జూలై 27న విడుదల చేయాలని నిర్మాత దిల్ రాజు భావించారు.
కాని సినిమా షూటింగ్ ఆలస్యం కావడంతో సినిమా విడుదల తీదీని మార్చినట్లు తెలుస్తుంది.ఈ సినిమా విడుదల తేదీని ఆగస్టు 9కి వాయిదా వేసినట్లు దిల్ రాజు పేర్కొన్నారు. ఈ చిత్రానికి మిక్కీజే మేయర్ స్వరాలు అందిస్తున్నారు. నందితా శ్వేత, ప్రకాష్ రాజ్లు కీలక భూమిక పోషిస్తున్నారు. ఈ సినిమా హిట్పై చాలా నమ్మకంతో ఉన్నాడు హీరో నితిన్. ఆయన నటించిన గత రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ కావడంతో ‘శ్రీనివాస కళ్యాణం’ పై చాలా ఆశలు పెట్టుకున్నాడు నితిన్.