Wednesday, May 22, 2024
- Advertisement -

బాలయ్య నిర్మాతకు కష్టాలు.. నాన్ బెయిల్ వారెంట్!

- Advertisement -

బోయపాటి శ్రీను జయ జానకి నాయక, నాగచైతన్య సాహసం శ్వాసగా సాగిపో వంటి సినిమాలు నిర్మించిన నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ప్రస్తుతం బోయపాటి,బాలయ్య కాంబినేషన్ సినిమా నిర్మిస్తున్నాడు. తాజాగా ఈ నిర్మాతకు నాన్ మెయిల్ వారెంట్ ఇష్యూ అయ్యింది. వీందర్ రెడ్డి మీద ప్రతిపాడు మేజిస్ట్రేట్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ (ఎన్‌బిడబ్ల్యు) ఇష్యూ చేసింది. రవీందర్ రెడ్డి మీద ఓ డిస్ట్రిబ్యూటర్ చీటింగ్ కేసు పెట్టారు. ఆరేళ్ల కిందటి కేసు ఇప్పుడు చివరి దశకు వచ్చింది. అయితే కేసు విచారణకు ఆయన హాజరు కాకపోవడంతో కోర్టు అతడికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.

అయితే  బోయపాటి,బాలయ్య కాంబినేషన్ వస్తున్న ఈ మూవీకి మొదటి నుంచి రక రకాల అవాంతరాలు వస్తూనే ఉన్నాయి. రవీందర్ రెడ్డి గతంలో నాగ చైతన్య హీరోగా రూపొందిన ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమాను నిర్మించారు. సినిమాకు సంబంధించిన ఓవర్సీస్ బిజినెస్ విషయంలోనే కొన్ని వివాదాలు జరిగినట్లు సమాచారం. అమెరికాలో సెటిలైన ఒక డిస్ట్రిబ్యూటర్ వద్ద నుండి సినిమాను ఇస్తానంటూ 50 లక్షలు తీసుకున్నారట రవీందర్ రెడ్డి. కానీ అగ్రిమెంట్ ప్రకారం వారికి కాకుండా వేరే వారికి అమ్మేశారట. పోనీ తమ డబ్బు తమకు తిరిగి ఇవ్వమంటే ముఖం చాటేశారట.

డిస్ట్రిబ్యూటర్ నుంచి తీసుకున్న మొత్తం వెనక్కి ఇవ్వకుండా పది లక్షలు మాత్రమే ఇస్తానంటున్నారుట. దీంతో సదరు డిస్ట్రిబ్యూటర్ కేసు వేయడంతో ఆయన మీద నాన్ బెయిలబుల్ వారంట్ జారీ అయింది. కోర్టు రవీందర్ రెడ్డిని విచారణకు హాజరుకావాలని పలుసార్లు ఆదేశించింది. కానీ ఆయన హాజరుకాలేదు. దీంతో ప్రత్తిపాడు మేజిస్ట్రేట్ కోర్టు ఆయన మీద నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. మరి వివాదం నుండి రవీందర్ రెడ్డి ఎలా భయటపడతారో చూడాలి.

సన్నిహితుల సమక్షంలో… నటి మెహ్రీన్ నిశ్చితార్థం..!

డ్రగ్స్ కేసులో టాలీవుడ్ నటుడు తనీష్ కి నోటీసులు‌!

బుల్లితెరపై దేవిశ్రీ ప్రసాద్ అదుర్స్ !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -