పవర్స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ ‘అజ్ఞాతవాసి’ టీజర్ ఇటీవలే విడుదలై యూట్యుబ్లో సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.అయితే ‘అజ్ఞాతవాసి’ ఆడియో వేడుక హైదరాబాద్లోని నోవాటెల్ హోటల్లో భారీ ఎత్తున జరుగునుంది.ఇప్పటికే ఏర్పాట్లన్నీ ముమ్మరంగా జరుగుతుండగా ఎంట్రీ పాస్ లకు గట్టి డిమాండ్ నెలకొంది. ఈ ఫంక్షన్కి అతిథులుగా విక్టరీ వెంకటేష్, ఎన్టీఆర్ లు హాజరవుతారని ఫిల్మ్ నగర్ వర్గాల్లో వార్తలు హల్ చల్ చేస్తన్నాయి.అయితే నిర్మాతలు మాత్రం ఈ విషయంపై ఇంకా క్లారీటి ఇవ్వలేదు.
ఎన్టీఆర్తో త్రివిక్రమ్ సినిమా చేస్తుడంటంతో ఎన్టీఆర్ దీనికి అతిథిగా వెళ్తారని,కొద్దిరోజుల క్రితమే జరిగిన ఎన్టీఆర్ సినిమా ప్రారంభోత్సవానికి పవన్ ముఖ్య అతిథిగా వెళ్లారు కుడా.ఇంకా వెంకీ విషయానికి వస్తే పవన్ -వెంకీ మంచి మిత్రలు పైగా కలిసి ఒక సినిమా కుడా చేశారు.త్రివిక్రమ్తో కుడా మంచి రిలేషన్ ఉంది వెంకీకి.అలాగే ‘అజ్ఞాతవాసి’ చిత్రంలో వెంకీ కాసేపు మెరవనున్నారు.ఈ అంశాలన్నిటినీ బట్టి చూస్తే ఇప్పుడు వినిపిస్తున్న గుసగుసలే వాస్తవమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.