దేశంలో గత వారం రోజులుగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. సమాన్య జనం నుంచి ప్రముఖుల వరకు ఎవరినీ వదలడం లేదు ఈ మహమ్మరి. మరీ ముఖ్యంగా సినీ వర్గాల్లో తీవ్ర స్థాయిలో కలవరం రేపుతోంది. కోవిడ్-19 బారినపడుతున్న సినీ తారల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా ప్రముఖ నటుడు పరేష్ రావల్ కు కరోనా సోకినట్టు నిర్థారణ అయింది.
ఇటీవల షూటింగ్ లలో పాల్గొంటున్న సినీ తారలు వైరస్ బారినపడుతున్న వారు పెరుగుతూనే ఉన్నారు. ఈ క్రమంలోనే షూటింగ్ సమయంలో పరేష్ రావల్ కు అనారోగ్యంగా అనిపించడంతో కరోనా పరీక్షలు చేయించుకున్నారు. దీంతో ఆయనకు పాజిటివ్ గా నిర్థారణ అయింది. ప్రస్తుతం ఆయన హోం క్వారంటైన్ ఉండి చికిత్స పొందుతున్నారు. కాగా, ఇటీవలే బాలీవుడ్ స్టార్స్ అమీర్ ఖాన్, మాధవన్ లకు కూడా కరోనా సోకిన విషయం తెలిసిందే.
కాగా, ఇప్పటివరకు కరోనా బారినపడిన సినీ ప్రముఖులు చాలా మందే ఉన్నారు. వారిలో మెగా ఫ్యామిలీ హీరోలైన రామ్ చరణ్, వరుణ్ తేజ్ లు సైతం కరోనా బారినపడి కోలుకున్నారు. కోలీవుడ్ స్టార్ హీరో శరత్ కుమార్కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. బాలీవుడ్ హాట్ బ్యూటీ కృతి సనన్, వరుణ్ ధావన్, అనిల్ కపూర్, నీతూ కపూర్లతో పాటు దర్శకుడికి కరోనా నిర్ధారణ అయింది. బాలీవుడ్ యాక్షన్ హీరో బీజేపీ ఎంపీ సన్ని డియోల్కు కరోనా సోకింది.
బ్లాక్ కాఫీతో ఆ సమస్యలన్నీ పరార్