బాలీవుడ్ ఇండస్ట్రీలో కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్న నటి కంగనా రౌనత్ కి ఇప్పుడు కొత్త కష్టాలు ఎదురయ్యాయి. గత కొంత కాలంగా ఆమె డ్రగ్స్, సినీ వారసత్వం ఇతర విషయాలపై పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వంపై కంగానా చేసిన విమర్శలు ఆమెను చిక్కుల్లోకి నెట్టాయి. దాంతో ఆమెపై పలు కేసులు కూడా నమోదు అయ్యాయి. తాజాగా కంగనా పాస్ పోర్టు గడువు సెప్టెంబర్ 15న ముగియనుంది. అయితే ఆమె పాస్ పోర్టును రెన్యువల్ చేసేందుకు అధికారులు నిరాకరించారు.
ఈ క్రమంలో ఆమె ముంబయి హైకోర్టును ఆశ్రయించింది. ప్రస్తుతం ఆమె ‘తేజస్’ నటిస్తుంది.. ఈ క్రమంలోనే షూటింగ్ కోసం కంగనా హంగేరిలోని బుడాపెస్ట్కు వెళ్లాల్సి ఉంది. ఈ నెల 15నుంచి ఆగస్టు 30 వరకు అక్కడ షూటింగ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆమె తన పాస్ పోర్టును రెన్యువల్ చేయాలని ఆమె ముంబయిలోని పాస్పోర్టు కార్యాలయానికి వెళ్లారు. పాస్ పోర్టు రెన్యువల్ ప్రక్రియ ముందుకు వెళ్లాలంటే పోలీస్ వెరిఫికేషన్ తప్పనిసరిగా ఉండాల్పిందే.
అయితే ఇప్పటికే ఆమెపై బాంద్రా పోలీస్ స్టేషన్ లో కంగనాపై దేశద్రోహం కేసు నమోదైన విషయం తెలిసిందే. దాంతో ఆమెకు పాస్ పోర్ట్ జారీ చేయడానికి అధికారులు నిరాకరించారు. తాను షూటింగ్ నిమిత్తం అబ్రాడ్ కి వెళ్లాల్సి ఉందని వారికి రిక్వెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే పాస్పోర్టు పునరుద్థరించేందుకు అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని ఆమె ముంబయి హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ కేసు ఈనెల 25వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది.
కఠిన సమయంలోను ఆ పనిని విజయవంతంగా పూర్తి చేసిన తమన్నా!