తెలుగు ప్రజలు తనపై చూపించిన అభిమానం ఎన్నటికీ మరువలేనిదని అన్నారు సినీనటి, మహారాష్ట్రలోని అమరావతి ఎంపీ నవనీత్ కౌర్. శుక్రవారం తిరుమల వెంకటేశ్వరుడిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. దర్శనానంతరం సినీనటి నవనీత్కౌర్ మీడియాతో మాట్లాడుతూ… తెలుగు ప్రజల వల్లే తనకు పేరొచ్చిందని చెప్పారు. తన ఎన్నిక వ్యవహారంలో బాంబే హైకోర్టు ఆదేశాలపై సుప్రీం కోర్టు స్టే ఇవ్వడంతో వెంకటేశ్వరుడిని దర్శించుకున్నట్లు తెలిపారు.
తెలుగు రాష్ట్రాల్లోని రైతులు, మహిళలు, యువతకు సహాయం చేస్తానన్నారు. దేశంలో కరోనా ప్రభావం తగ్గి ప్రజలు సంతోషంగా ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. కాగా, నవనీత్కౌర్తోపాటు ఈరోజు ఉదయం విఐపి బ్రేక్ దర్శనం సమయంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి రామ సుబ్రమణియన్, ఎపి మంత్రి వేణుగోపాలకఅష్ణ, ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, సినీనటుడు రాజేంద్రప్రసాద్, టిడిపి ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ స్వామివారిని దర్శించుకున్నారు.
ప్రముఖులకు టిటిడి అధికారులు ఘన స్వాగతం పలికి దర్శనం చేయించారు. మహారాష్ట్ర, తెలుగు రాష్ట్రాలు తనకు రెండు కళ్లని, తెలుగు ప్రజలకు సేవ చేసేందుకు తనవంతుగా ప్రయత్నిస్తానన్నారు. ఏపీ రైతుల తరుపున లోకసభలో తన గలం వినిపిస్తానని స్పష్టం చేశారు. మహారాష్ట్ర ప్రజల తర్వాత, తెలుగు ప్రజల సమస్యల పరిష్కరంపైనే దృష్టి పెడతానని ఎంపీ నవనీత్ కౌర్ పేర్కొన్నారు.
టీచర్ జాబ్ సంపాదించిన మలయాళ బ్యూటీ!