జనసేన అధినేత, నటుడు పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికలే లక్ష్యంగా ప్రణాళికలను సిధ్తం చేసుకుంటున్నారు.దీనిలో భాగంగానే పవన్ అటు టీడీపీ పార్టీ,ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీలపై విమర్శలు గుప్పిస్తున్నారు.అయితే పవన్పై కొందరు నెగిటివ్ కామెంట్లు చేయడంతో పాటు అతడి కుటుంబాన్ని కూడా టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారట.సోషల్ మీడియాలో కొందరు పవన్ వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. తాజాగా అతడి తల్లి ఫోటోలను మార్ఫింగ్ చేసి అసభ్యకర రీతిలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.దీనిని చాలా సీరియస్గా తీసుకున్న జనసేన పార్టీ వారిపై కఠన చర్యలు తీసుకోవలని డిమాండ్ చేశారు.
‘చంటిఅబ్బాయి’ అనే ట్విట్టర్ అకౌంట్ నుండి మార్ఫింగ్ చేసిన ఫోటోలను పోస్ట్ చేసినట్లు తెలిసింది. ఈ చర్యపై పవన్ అభిమానులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు . ఇలాంటి పనులకు పాల్పడుతున్న వారిని శిక్షించాలంటూ కోరారు. గతంలో టాలీవుడ్ వివాస్పద నటి శ్రీరెడ్డి పవన్తో పాటు,పవన్ అమ్మగారిపై కూడా అనుచిత వాఖ్యలు చేసి సంచలనం సృష్టించింది.అప్పడు పవన్ శ్రీరెడ్డిపై యాక్షన్ తీసుకోవలని మా అసోసియేషన్ ముందు ధర్నాకు కూడా దిగారు. మరి ఈ వ్యవహరంపై పవన్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.