Thursday, May 2, 2024
- Advertisement -

ప‌వ‌న్‌పై ఘాటు సెటైర్లు సంధించిన వీరాభిమాని పూన‌మ్ కౌర్‌

- Advertisement -

జ‌న‌సేన పార్టీ ఆవిర్భావ స‌భ‌లో ప‌వ‌న్‌ టీడీపీని ఏకిపారేశారు. ప్ర‌భుత్వంలో జ‌రుగుతున్న అరాచ‌కాలు,లోకేష్ అవినీతిపై చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే ప‌వ‌న్ వీరాభిమాని పూన‌మ్‌కౌర్ ప‌వ‌న్‌పై ఘాటు విమ‌ర్శ‌లు చేయ‌డం సంచ‌ల‌నం రేపుతున్నాయి.

పవన్ సిఫారసుతో రాష్ట్రప్రభుత్వపు బ్రాండ్ అంబాసిడర్ గా నియమితులైంద‌న్న సంగ‌తి తెలిసిందే. పూనం కౌర్ ప్రస్తుతం ఏపీ ప్రభుత్వపు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమ చేనేత ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా టాప్ రేంజి హీరోయన్ ను సమంతను నియమించుకుంటే.. దానికి పోటీనా అన్నట్లుగా ఏపీ ప్రభుత్వం ప‌వ‌న్ సిఫారుసుతో హీరోయిన్ పూనం కౌర్ ను అంబాసిడ‌ర్‌గా నియమించుకుంది.

ఎప్పుడూ సోషియ‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే పూన‌మ్ ఇప్పుడు సోషియ‌ల్ మీడియాలో ప‌వ‌న్ పై పెట్టిన పోష్ట్ సోషియల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. ఈ పోస్ట్ లో తను ఏమి చెప్పిందంటే కొంతమంది గేమ్స్ ఆడుతున్నారు. కాన్సెప్ట్ లు డైలాగులు కాపీ కొట్టి జనాలను అమాయకులను చేసి ఆడుకుంటున్నారంటు పోస్ట్ చేసింది.

దీనిని చూస్తుంటే నిన్న పవన్ గుంటూరు సభలలో పవన్ స్పీచ్ కి తన కౌంటర్ వేస్తున్నట్టు అని అర్థమయ్యేల ఉన్నా మరి ఆ పోస్ట్ ఇప్పుడే ఎందుకు పోస్ట్ చేసిందో తనకే తెలియాలి. మరి ఇది తను పోస్ట్ చేయలేదని తను ఉమెన్స్ డే తర్వాత తన అకౌంట్ వాడటలేదని తన దగ్గర సన్నిహితులు చెప్తున్నారు. అయితే ఇందులో నిజం ఉన్నా లేకున్నా దీనిపై ప‌వ‌న్ అభిమానులు ఎలా స్పందిస్తారో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -