టాలీవుడ్లో ఒకప్పుడు హీరోల ఫ్యాన్స్ తమ హీరో గొప్ప అంటే మత హీరో గొప్ప అని చెప్పుకునేవారు.ఇప్పుడు పరిస్థితి మారిపోయింది.అభిమానం కొట్టుకునే వరకు వెళ్లింది.ఈ విషయంలో హీరోలు స్పందించకపొడంపై విమర్శలు కూడా వచ్చాయి. ఇప్పుడు తెలుగు హీరోలు తమ మనస్సు మార్చుకున్నట్లు కనిపిస్తుంది.ఒక హీరో సినిమా హిట్ అయితే మరో హీరో సినిమాను చూసి ప్రశంసించడం టాలీవుడ్లో జరుగుతుంది.ఇది మొదట మహేష్ బాబు మొదలు పెట్టారు. చాలామంది హీరోలు ఇప్పుడు దీనిని ఫాలో అవుతున్నారు.అలాగే మొన్న జరిగిన మహేష్ బాబు తాజా చిత్రం భరత్ అను నేను సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షనకు తారక్ హాజరై అందరిని ఆశ్చర్యపరిచాడు.ఈ ఫంక్షన్లో మహేష్ మాట్లాడుతు మేము ,మేము బాగానే ఉంటాం మీరే బాగుపడాలి అని అభిమానులను హెచ్చరించాడు కూడా.
ఇక మీద అందరి ఫంక్షన్లకు హీరోలందరు వస్తారు చూడండి అన్న మహేష్ మాటలను నిజం చేస్తు ఇప్పడు మరో పెద్ద హీరో మరో హీరో ఆడియో ఈవెంట్కు వస్తున్నాడని సమాచారం. ఆ హీరోలు ఎవరో కాదు.స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ,రెబల్ స్గార్ ప్రభాస్.వీరిద్దరు మంచి స్నేహితులు కావడంతో బన్నీ ఆడియో ఈవెంట్కు ప్రభాస్ వస్తానని మాట ఇచ్చాడని తెలుస్తుంది.నా పేరు సూర్య ఆడియో ఫంక్షన్కు ముఖ్య అతిథిగా ప్రభాస్ హాజరు కానున్నారనే వార్త సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తుంది. ఈ చిత్రం మే 4వ తేదీన రిలీజ్కు సిద్దమవుతున్నది.