బాహుబలితో ఇండియన్ స్టార్ అయ్యారు ప్రభాస్. ఈ సినిమాతో ప్రభాస్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. బాహుబలి తరువత ప్రభాస్ నుంచి వస్తున్న చిత్రం కోసం ప్రస్తుతం దేశమంతా ఆసక్తికరంగా చూస్తోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సాహో సినిమా ఎలా ఉంటుందా అని చాలా వరకు టాలీవుడ్ మీడియాపై ఓ కన్నేసి ఉంచుతున్నారు.ప్రభాస్ మళ్లీ తన బాక్స్ ఆఫీస్ స్టామినను చూపిస్తాడు అని మీడియలో కథనాలు వెలువాడుతున్నాయి.ప్రభాస్ ప్రస్తుతం సుజిత్ దర్శకత్వంలో సాహో సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమా షూటింగ్ అబుదాబిలో జరుపుకుంటుంది. ప్రస్తుతం అబుదాబిలో భారీ యాక్షన్ ఛేజింగ్ సీన్స్ను చిత్రీకరిస్తున్నారు. దీనిలో భాగంగానే 37 కార్లను, 4 ట్రక్కులను వినియోగిస్తున్నారట. ఈ భారీ చేజింగ్ సన్నివేశాలు హాలివుడ్ తరహాలో ఉండబోతోందని సమాచారం. ఈ సినిమాను వచ్చే సంవత్సరం రిలీజ్ చేయలని చూస్తున్నారు చిత్ర నిర్మాతలు.సినిమాలో ప్రభాస్ పక్కన బాలీవుడ్ హీరోయిన్ శ్రధ్ధా కపూర్ నటిస్తుంది.ఈ సినిమాలో హింది నటుడు నెయిల్ నితిన్ ముఖేష్ మెయిన్ విలన్ గా కనిపించనున్నారు.