- Advertisement -
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం సాహో.బాహుబలి తరువాత ప్రభాస్ నుంచి వస్తున్న సినిమా కావడంతో సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.చిత్ర యూనిట్ కూడా దానికి తగినట్లుగానే సినిమాను తెరకెక్కిస్తున్నారు.రన్ రాజా రన్ ఫేం సుజిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.హాలీవుడ్ రేంజ్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను 250 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు.
అయితే ఈ సినిమా షూటింగ్కు వాహనాలు సమకూర్చటం చిత్రయూనిట్ కు భారంగా మారుతుందట. ఇటలీలో బిల్డింగ్స్ అన్ని ఇప్పటికే వింటేజ్ లుక్తో కనిపిస్తున్నా వాహానాలు మాత్రం మోడ్రన్గా మారిపోయాయి. దీంతో వింటేజ్ కార్లు, బస్సులు సేకరించే పనిలో ఉన్నారు చిత్రయూనిట్. ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ నటిస్తుంది.