Friday, May 10, 2024
- Advertisement -

కొనసాగుతున్న రీమేక్ లు.. ఇప్పుడు “వర్షం” వంతు వచ్చింది!

- Advertisement -

బాలీవుడ్ లో తెలుగు సినిమాల రీమేక్ ల పరంపర కొనసాగుతోంది. టాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన సినిమాలను హిందీ వాళ్లు వదలడం లేదు. దాదాపు పదేళ్ల కిందట వచ్చిన సినిమాలను కూడా ఇప్పుడిప్పుడే వాళ్లు రీమేక్ చేస్తున్నారు.

ఇటీవలే మహేశ్ బాబు ‘ఒక్కడు’ హిందీలో రీమేక్్ అయ్యింది. ఆ సినిమా అక్కడ అంతగా ఆడలేదు కానీ.. ఇప్పుడు ‘వర్షం” వంతు వచ్చింది.

ప్రభాస్ కు హీరోగా, త్రిషకు హీరోయిన్ గా లైఫిచ్చిన  ఈ సినిమా ను హిందీలో రీమేక్ చేస్తున్నారిప్పుడు. ఇందులో జాకీష్రాఫ్ తనయుడు టైగర్ ష్రాఫ్ హీరోగా నటిస్తున్నాడు. శ్రద్ధకపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. విశేషం ఏమిటంటే. .ఈ సినిమాతో హిందీ చిత్ర పరిశ్రమకు  పరిచయం అవుతున్నాడు సుధీర్ బాబు.

తెలుగులో హీరోగా పలు ప్రయత్నాలు చేసిన ఈ హీరో ఇక్కడ ఏమీ కలసి రాకపోవడంతో హిందీ వైపు వెళుతున్నాడు. తెలుగులో గోపిచంద్ చేసిన విలన్ పాత్రను చేస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకొంటున్నాడు. మరి ఫలితం ఎలా ఉంటుందో చూడాలి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -