“ఎవరే అతగాడు” సినిమాతో తెలుగు వెండితెరకు పరిచమైన కథానాయిక ప్రియమణి. ఈ సినిమా పెద్దగా ఈ కేరళ కుట్టికి పేరు తీసుకురాకపోయిన.. ఆ తర్వాత నటించిన ‘పెళ్లయిన కొత్తలో, యమదొంగ, శంభో శివ శంభో, సాధ్యం, రగడ’ వంటి సినిమాలతో స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. సినీ కెరియర్ రైయ్ రైయ్ మంటూ దూసుకుపోతున్న తరుణంలోనే ఈ హాట్ బ్యూటీ పెళ్లి చేసుకుంది.
ఒప్పుడు స్టార్ హీరోయిన్ రేసులో ఉన్న ముద్డుగుమ్మ వివాహం చేసుకోవడంతో కాస్త వెనుకబడింది. దీంతో కొంత కాలం సినిమాలకు దూరంగా ఉన్నారు. అయితే, పలు టీవీ షో కార్యక్రమాల్లో న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తూ.. పలు బుల్లితెర కార్యక్రమాలలో మెరుస్తోంది. ప్రస్తుతం ఆమె వెండితెర సెంకండ్ ఇన్నింగ్స్ ను మొదలుపెట్టింది. ప్రస్తుతం తమిళ బ్లాక్బస్టర్ మూవీ ‘అసురాన్’ తెలుగు రీమేక్ ‘నారప్ప’ సినిమాలో నటిస్తోంది. అలాగే, దగ్గుపాటి యంగ్ హీరో రానా కథానాయకుడిగా తెరకెక్కుతున్న వీరాటపర్వం సినిమాలోనూ ప్రియమణి ఓ కీలక పాత్రలో నటిస్తోంది. అయితే హీరోయిన్ కంటే ఇప్పుడే కెరియర్ బాగుందని చెప్పాలి.
Also Read: ఆ వివాదం పై సమంత స్పందించక పోవడానికి కారణం అదే!
అయితే ఈ కేరళ కుట్టి “ది ఫ్యామిలీ మ్యాన్” వెబ్ సిరీస్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ప్రియమణి మనోజ్ బాజ్పేయి భార్యగా నటించింది. ఈ మద్యనే ది ఫ్యామిలీ మ్యాన్ 2 ట్రైలర్ రీలిజ్ అయింది. ఇందులో సమంత ఎల్.టి.టి.ఇ రెబల్ రాజీ పాత్రలోఅద్భుతంగా నటించిందట. ఆ పాత్ర పై విమర్శలు, వివాదాలు నెలకొన్నాయి. ఇది ఇలా ఉంచితే ఇందులో ప్రియమణి పాత్ర పై ఎన్నో ఊహాగానాలు వస్తున్నాయి. కుటుంబంను పట్టించుకోని భర్తతో విసిగిన ప్రియమణి ఓ బిజినెస్ మెన్ తో ఎఫైర్ పెట్టుకుని.. భర్తతో విడాకులు తీసుకుంటునట్టు ట్రైలర్ చూపించారు. ఇదే విషయం పై ప్రియమణి స్పందిస్తూ చూడండి తెలుస్తుంది అంటు చేప్పుకొచ్చింది.
Also Read: ఆ విషయంలో నన్ను క్షమించండి అంటున్న కొత్త పెళ్ళికూతురు..!