బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా హాలీవుడ్ సింగర్ నిక్ జోనాస్తో గత కాలంగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసింది.ఇరు కుటుంబాల అంగీకారంతో ఇటీవలే వీరిద్దరి నిశ్చితార్థం ముంబైలో చాలా సింపుల్గా చేశారు.ప్రియాంక ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటుంది.ప్రియాంక చోప్రా-నిక్ జోనాస్ జంట విహారయాత్రలో ఎంజాయ్ చేస్తున్నారు.రోమన్లో ఉన్న ఈ జంట అక్కడ చేసిన ఓ చిన్న పనితో వార్తల్లో నిలిచింది.విదేశాల్లో క్వాంటికో సిరీస్ చేసినప్పుడు ఈ అమ్మడు మైండ్ సెట్ పూర్తిగా మార్చుకుంది. రొటీన్ ఇండియన్ మైండ్ సెట్ నుంచి కాస్తంత దూరంగా జరిగింది.
ప్రియుడు నిక్ జోనాస్తో కలిసి మందేస్తూ అలా సరదాగా టెన్నిస్ టోర్నీని వీక్షిస్తోంది. యూఎస్ ఓపెన్ లో రఫెల్ నాదల్ ఆటను పీసీ-నిక్ జంట ఇలా ఆస్వాధించారు.ఇలా ప్రియుడుతో కలిసి ప్రియాంక బీర్ తాగడాన్ని నెటిజన్లు విమర్శిస్తున్నారు.భారతదేశపు స్త్రీ అయి ఉండి ఇలా చేయడం ఏంటీ అని ప్రియాంకను ప్రశ్నిస్తున్నారు.మరికొంతమంది ప్రియాంక భారతదేశపు స్త్రీ కాదని కామెంట్ చేస్తున్నారు. నిక్ జోనాస్తో కలిసినప్పటి దగ్గర నుంచి ప్రియాంకలో చాలా మార్పులు వచ్చాయని కొందరు చర్చించుకుంటున్నారు.