గత కొన్ని రోజులుగా తెలుగు ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. నిర్మాత అన్నంరెడ్డి కృష్ణకుమార్ ఈ తెల్లవారుజామున విశాఖపట్టణంలో గుండెపోటుతో కన్నుమూశారు. సినీ ప్రముఖుల వరుస మరణవార్తలతో టాలీవుడ్లో విషాద వాతావరణం నెలకొంది.
ఇప్పటికే పరిశ్రమలో పేరు పొందిన గాయకుడు జి.ఆనంద్, స్టిల్ ఫొటోగ్రాఫర్ మోహన్జీతో పాటు రచయిత నంద్యాల రవి, నటుడు టీఎన్ఆర్, పీఆర్వో బీఏ రాజుల వరుస మరణాలతో చిత్రపరిశ్రమలో తీరని లోటు ఏర్పడిన సంగతి తెలిసిందే. అన్నంరెడ్డి తాజాగా నిర్మించిన ‘అనుకోని అతిథి’ సినిమా మరో రెండు రోజుల్లో ‘ఆహా’లో విడుదల కాబోతోంది.
సాయిపల్లవి, ఫహాద్ ఫాజిల్ జంటగా నటించిన ‘అనుకోని అతిథి’ చిత్రానికి ఆయన నిర్మాతగా వ్యవహరించారు. నిర్మాత కృష్ణకుమార్ మృతిచెందడంతో చిత్రబృందమే కాకుండా మొత్తం టాలీవుడ్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యింది. మరోవైపు పలువురు సినీ ప్రముఖులు సైతం ఆయన మృతిపట్ల సంతాపం ప్రకటించారు. కృష్ణకుమార్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
సైకలాజికల్ థ్రిల్లర్ గా ‘అనుకోని అతిథి’ ట్రైలర్ రిలీజ్