యంగ్ టైగర్ ఎన్టీఆర్, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ‘టెంపర్’. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ సాధించింది. ఫ్లాప్స్ తో సతమతమవుతున్న పూరీకి, ఎన్టీఆర్కీ ఈ సినిమా మంచి రిలీఫ్ ఇచ్చింది. మరో సారి ఈ కాంబినేషన్ రీపీట్ కాబోతోంది. ప్రస్తుతం పూరి కళ్యాణ్ రామ్ తో ఇజమ్ అనే సినిమా చేస్తున్నాడు.
ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్ తో ప్రాజెక్ట్ సెట్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ విడుదలకు సిద్దమైయింది. సెప్టంబర్ 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్ ఒక్కంత వంశీ డైరెక్షన్ లో ఓ చిత్రంలో నటించబోతున్నాడు. ఆ చిత్రం తర్వాత ఇంకా ఏ సినిమా కమిట్ అవ్వాలేదు.
అలాగే ప్రస్తుతం కళ్యాణ్ రామ్ తో ఇజం చేస్తున్న పూరి, ఈ చిత్రం తర్వాత ఇంకో చిత్రంకు కమిట్ కాలేదు. మహేష్ తో ఓ సినిమా చేద్దాం అనుకున్నప్పటికీ అది ఇప్పట్లో కుదిరేలా లేదు. అందుకే తన తదుపరి సినిమాని ఎన్టీఆర్ తో చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు పూరి. త్వరలోనే వీరి కాంబినేషన్ పై వచ్చే కొత్త చిత్రంపై ఓ క్లారిటీ రానుంది.
Related
