Thursday, April 18, 2024
- Advertisement -

రాశీఖన్నా స్ట్రాంగ్ వార్నింగ్

- Advertisement -

దక్షిణాది చిత్ర పరిశ్రమను దూషిస్తూ వ్యాఖ్యలు చేసిందంటూ అవుతున్న ప్రచారంపై నటి రాశీఖన్నా ఘాటుగా స్పందించింది. ఊహలుగుసగుసలాడే సినిమాతో టాలీవుడ్ కు పరిచమైన ఈ అమ్మడు మంచి అవకాశాలు అందిపుచ్చుకుని.. తక్కువ కాలంలోనే యంగ్ హీరోలందరి సరిసన నటించి మెప్పించింది. ప్రస్తుతం వెబ్ సిరీస్ లు నటిస్తూ జోరుమీదుంది.

సౌత్‌ సినిమా ఇండస్ట్రీలో తన టాలెంట్‌కు తగ్గ అవకాశాలు రాలేదని, నటిగా ఎదిగే క్రమంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని రాశీ ఖన్నా వ్యాఖ్యలు చేసిందంటూ నెట్టింట్లో ఇటీవల జోరుగా ప్రచారం జరిగింది. తనను హీరోయిన్ గా నిలబెట్టిన సౌత్ ఇండస్ట్రీలపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని సినీ ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్‌ మీడియా వేదికగా రాశీఖన్నాకు వ్యతిరేకంగా పోస్ట్‌లు పెట్టారు.

దాంతో ఎట్టకేలకు ఈ వ్యవహారంపై రాశీఖన్నా స్పందించింది. తాను ఏ భాషలో సినిమాలు చేసినా, ఆ భాషపైనా, సినిమా పైనా తనకు గౌరవ మర్యాదలు ఉన్నాయని చెప్పుకొచ్చింది. దయ చేసి నాపై ఇలాంటి అసత్య ప్రచారాలు ఇకనైన ఆపండి అంటూ ఒక్కింత ఘాటుగా ట్విట్టర్ లో పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం తెలుగులో పక్కా కమర్షియల్, థ్యాంక్యూ, హిందీలో యోధ సినిమాల్లో రాశీకన్నా నటిస్తోంది.

ఆర్ఆర్ఆర్ తరహాలో ప్లాన్ చేస్తున్న బన్నీ

విలన్ ను పెళ్లాడబోతున్న హీరోయిన్

ఆ వ్యక్తిపై ఫైర్ అయిన అనసూయ

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -