Monday, May 20, 2024
- Advertisement -

మహేష్ కోసం సిద్దమైన మురగదాస్ టీం !

- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు – డైరెక్టర్ మురుగదాస్ ల కాంబినేషన్ లో సినిమా అంటే అందరికీ ఎప్పటి నుంచో ఎక్స్ పెక్టేషన్ లు పీక్స్ లో ఉన్నాయి భారీ బడ్జెట్ సినిమాగా తెరకి ఎక్కిన ఈ చిత్రం సెట్స్ మీదకి వెళ్లేందుకు సిద్దం అవుతోంది.

సౌత్ ఇండియా లోనే మోస్ట్ వాంటెడ్ ప్రాజెక్ట్ గా దీన్ని ప్రస్తుతం పిలుస్తున్నారు అందరూ. గత చిత్రం బ్రహ్మోత్సవం అట్టర్ ప్లాప్ అవ్వడం తో మహేష్ కూడా ఈ సినిమా వ్యవహారం లో చాలా జాగ్రత్తగా ఉన్నాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్ళబోతోంది.ఇక ఈ సినిమా టీమ్‌లో ప్రధానమైన వారంతా ఇప్పటికే దాదాపుగా ఖరారవ్వగా, ఇంకా హీరోయిన్ ఎవరన్నది స్పష్టంగా తెలియాల్సి ఉంది.

కొద్దికాలం క్రితం వరకూ బాలీవుడ్ స్టార్ పరిణీతి చోప్రా పేరు వినిపించినా, తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ పేరు బాగా ప్రచారంలోకి వచ్చింది. మరికొద్దిరోజుల్లో ఈ విషయమై ఓ క్లారిటీ వస్తుంది. ఇక విలన్‌గా ప్రముఖ దర్శకుడు ఎస్.జె. సూర్య నటించనున్నారు. హరీస్ జైరాజ్ సంగీతం సమకూర్చనుండగా, ఇండియన్ సినిమా బెస్ట్ సినిమాటోగ్రాఫర్స్‌లో ఒకరైన సంతోష్ శివన్ ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేయనున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో సుమారు 80 కోట్ల భారీ బడ్జెట్‌తో ఠాగూర్ మధు, ఎన్.వి.ప్రసాద్‌లు ఈ సినిమాను నిర్మించనున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -