Thursday, May 9, 2024
- Advertisement -

బండ్ల ఎందుకు సైలెంట్ అయిపోయాడు?

- Advertisement -

చాలా తక్కువ సమయంలోనే స్టార్ నిర్మాతగా మారిన బండ్ల గణేష్ తో సినిమాలు చేయటానికి స్టార్ హీరోలు క్యూ కట్టేవారు. హీరోలకు బాగా పారితోషికాన్ని ఇచ్చేవాడు. అలాగే హీరోయిన్స్ కూడా గణేష్ నిర్మాణ సంస్థలో నటించటానికి కూడా భారీ పారితోషికమే కారణం.

ఇదిలా ఉంటే ఈ మధ్య కాలంలో బండ్ల గణేష్ చాలా సైలెంట్ అయిపోయాడు. ఈ విషయంపై రకరకాల వార్తలు ఫిల్మ్ నగర్ లో హాల్ చల్ చేస్తున్నాయి. మెగా అభిమాని అయిన గణేష్ పవర్ స్టార్ తో ‘గబ్బర్ సింగ్’, చరణ్ హీరోగా ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమాలు తీసాడు. చాలా కాలం గ్యాప్ తీసుకోని ఎన్టీఆర్ తో ‘టెంపర్’ సినిమా తీసాడు. ‘గోవిందుడు అందరివాడేలే’ యావరేజ్ టాక్ వచ్చినా ‘టెంపర్’ మాత్రం హిట్ అయ్యింది. ఈ సినిమాకి భారీగా లాభాలు రాకపోయినా నష్టాలు మాత్రం రాలేదు. స్టార్ హీరోలతో సినిమాలు చేద్దామంటే ఎవరు ఖాళీగా లేరు. ప్రస్తుతం చరణ్,బన్ని డేట్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.

అలాగే అన్ని కుదిరితే వరుణ్ తేజ్ తో కూడా సినిమా చేయాలనే ప్లాన్ ఉన్నాడట. ఆ మధ్య స్టార్ హీరోలు అందుబాటులో లేకపోతే చిన్న హీరోలతో సినిమాలు చేస్తానని అన్నాడు. కానీ చిన్న హీరోలతో సినిమాలు చేయటానికి దైర్యం సరిపోవటం లేదు మరి గణేష్ కి. అలాగే మరొక వర్గం కధనం ప్రకారం గణేష్ పై ఉన్న కోర్టు కేసుల కారణంగా సైలెంట్ గా ఉన్నాడని అంటున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -